వ్యూహం మార్చిన ‘గులాబీ’ బాస్.. హుజూరాబాద్ రీ సర్వే ఏం తేల్చనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే యావత్ తెలంగాణ ప్రజల దృష్టి నెలకొంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీల నేతలంతా హుజూరాబాద్ కేంద్రంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఇప్పటికే ఓసారి సర్వే నిర్వహించిన అధికార పార్టీ మరోసారి సర్వే చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గులాబీ బాస్ ఆదేశాలతో సర్వే ఏజెన్సీలు, నిఘా వర్గాలు మరోసారి రంగంలోకి దిగి రీ సర్వే చేపడుతున్నాయి. ఈ నివేదిక ఆధారంగానే గులాబీ బాస్ పర్యటన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉండనుందనే టాక్ విన్పిస్తోంది.
హుజూరాబాద్ లో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే నెలకొంది. ఈ ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా మారడంతో ఇరుపార్టీలు నువ్వా.. నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండటం ఈ రెండు పార్టీల అభ్యర్థులకు కలిసి రానుంది. అదే సమయంలో ఇరు ప్రభుత్వాలపై ప్రజల్లోనూ కొంత వ్యతిరేకత ఉందని స్పష్టమవుతోంది. ఈ ఉప ఎన్నిక ఏ ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత ఉందో తేల్చే అవకాశం సైతం కన్పిస్తోంది. ఈనేపథ్యంలోనే టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య కొద్దిరోజులుగా మాటలయుద్ధం నడుస్తోంది.
Also Read
- South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
- Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
ఇలాంటి సమయంలోనే గులాబీ బాస్ హుజూరాబాద్ నియోజకవర్గంలో రీసర్వేకు ఆదేశించినట్లు తెలుస్తోంది. పోలింగ్ తేదికి సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్ల మనోగతం తెలుసుకునేలా మరోసారి సర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారట. ఈమేరకు సర్వే ఏజెన్సీలు, నిఘా వర్గాలను క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి గ్రామస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే వారి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే వ్యతిరేక ఓటుతోపాటు ఇతర పార్టీలకు అనుకూలంగా ఉన్న అంశాలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సర్వే తయారు చేసి రిపోర్టును అందజేయనున్నారు.
ఈ సర్వే ఫలితాల ఆధారంగా తదుపరి కార్యక్రమాలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టనున్నారు. హుజూరాబాద్ లోని ఆయా వర్గాల వారీగా వివరాలను తెలుసుకొని వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగానే సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు నియోజకవర్గంలో పర్యటించాలనేది కూడా డిసైడ్ కానుందని సమాచారం. ప్రచారంలో ఎలాంటి మార్పులు చేయాలి? ఓటర్లను ఆకర్షించేలా ఎలాంటి హామీలు ఇవ్వాలనేది కూడా ఈ సర్వే రిపోర్టు ఆధారంగానే చేయనున్నారు. పోలింగ్ తేది దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లాని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీలో ఒకింత హీట్ ను పుట్టిందనేది మాత్రం స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
New ZPs: ఏపీలో జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
-
AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
-
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!