జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి కేసులో బుద్గాం అదనపు పోలీసు సూపరింటెండెంట్ గౌహర్ అహ్మద్ ఖాన్, ఇటీవల అరెస్టయిన డీఎస్పీ ఆదిల్ ముస్తాక్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలన్నారు సీఎం జగన్.. దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.. ఇక, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలని స్పష్టం చేశారు.. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలన్న ఆయన.. దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు..
డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అర్హులైన వారిలో ఒకరికి తాత్కాలిక ప్రాతిపదికన డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ డీజీ అంజనీకుమార్ లేదా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తాలో ఒకరిని నియమించే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఐపీఎస్ అధికారిపై వేటు వేసింది కేరళ ప్రభుత్వం… కేరళ కేడర్కు ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మణ్ నాయక్ను సస్పెండ్ చేశారు సీఎం విజయన్.. నకిలీ పురాతన కళాఖండాలను విక్రయించిన కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ మోన్సన్ మవున్కల్తో లక్ష్మణ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలడంతో.. కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.. గతంలోనూ లక్ష్మణ్ నాయక్పై పలు ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు పోలీసులు. ఇక, 1997 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి…