DGP Anjanikumar: ఫంక్షనల్ వర్టికల్స్ పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులతో డీజీపీ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీస్ శాఖలోని ప్రతి స్థాయి పోలీస్ అధికారులకు నిర్దేశించిన ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరును సాంకేతికంగా విశ్లేషించి, గణాంకాలలో మార్చి గ్రేడింగ్ ఇచ్చి ప్రోత్సహించడం ద్వారా మొత్తం పోలీసు వ్యవస్థ యొక్క పనితీరు మరింత సమర్ధవంత పనిచేసే విషయంపై నేడు సాయంత్రం డీజీపీ అంజనీ కుమార్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ కార్యాలయంలో నేడు సాయంత్రం నిర్వహించిన సమావేశంలో, తెలంగాణా పోలీస్ శాఖలో అమలులో ఉన్న సంస్థాగత నిర్మాణం, ఫంక్షనల్ వర్టికల్స్ అంశాలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం అధికారులతో సవివరంగా సమీక్షించారు.
Read Also:Delhi : రాజధానిలో రెండేళ్ల గరిష్టస్థాయికి విద్యుత్ వినియోగంD
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
పోలీస్ శాఖలో ముఖ్యంగా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించే ప్రతీ స్థాయి అధికారులు తమకు ప్రత్యేకంగా కేయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించే అంశంలో డీజీపీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సమీక్షించాలని అంజనీ కుమార్ సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ప్రతీ ఒక్క పోలీస్ అధికారి పనిచేసేలా, ముఖ్యంగా పోలీస్ శాఖపై ప్రతి ఒక్కరిలో నమ్మకం కుదిరేలా మరింత అంకిత భావంతో పనిచేసేలా విశ్లేషించాలని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులను డీజీపీ కోరారు.
కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్
ఈశాన్య రాష్ట్రాల్లో జరుగనున్న శాసన సభ ఎన్నికల నిర్వహణకై తగు పోలీస్ బలగాలను పంపించే అంశంపై కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా నేడు తెలంగాణా తోపాటు పలు రాష్ట్రాల డీజీపీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ డీజీపీ కార్యాలయం నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు.
సున్నిత ప్రాంతాలుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఈ సంవత్సరం (2023 ) లో శాసన సభ ఎన్నికలు జరగనున్నందున, ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకుగాను అదనపు పోలీస్ బలగాలు అవసరమున్నాయని హోం శాఖ కార్యదర్శి ఏ.కే.భల్లా కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ ఎస్.కె. జైన్, బెటాలియన్స్ ఏ.డి.జి. అభిలాష బిష్త్ పాల్గొన్నారు
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!