హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలు జిల్లాలోని నియోలి-షంషేర్ రోడ్డులోని జంగ్లా ప్రాంతంలోని సైంజ్ లోయలో ప్రైవేటు బస్సు పడింది. బస్సు లోయలో పడటంతో నుజ్జనుజ్జు అయింది. ఈ ప్రమాదంలో 12 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో స్కూలు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. కులు నుంచి ప్రత్యేక రెస్క్యూ టీం ఘటనా ప్రాంతానికి చేరుకుని రక్షణ చర్యలను చేపడుతున్నారు. కులు డిప్యూటీ…
సుఖ్మన్ప్రీత్ సింగ్ (35) అలియాస్ సిప్పీ సిద్ధూ హత్య కేసు గుర్తుందా? నేషనల్ లెవల్ షూటర్ అయిన అతడు 2015 సెప్టెంబర్ 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. జాతీయ షూటర్, పైగా హైప్రొఫైల్ కుటుంబానికి చెందినవాడు కావడంతో.. సిప్పీ సిద్ధూ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, సరైన సాక్ష్యాధారాలు దొరక్కపోవడం వల్ల ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. ఏడేళ్ల వరకూ విచారణ కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ హత్య…
కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తుందని పలు రాష్ట్రాల సీఎంలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర రాష్ట్రాల సంబంధాల బలోపేతం కోసం జూన్ 16,17 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల వేదికగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పీఎం నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. రాష్ట్రాల్లో ఉత్తమ విధానాలు, అభివృద్ధి విధానాలపై చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎస్ లతో ప్రధాని నరేంద్రమోదీ సంభాషించనున్నారు. రాష్ట్రాలు…
సాధారణంగా రైళ్లు రైలు పట్టాలపై, బస్సులు రోడ్లపై ప్రయాణిస్తుంటాయి. కానీ బెంగళూరులోని ఓ రైల్వేస్టేషన్లో బస్సులన్నీ రైలెక్కి కూర్చున్నాయి. ఈ అరుదైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే… ఇప్పటివరకు మనం గూడ్స్ రైళ్లలో బైకులు, ట్రాక్టర్లు, లారీలు వంటి వాహనాలనే తరలించడం చూశాం. కానీ తొలిసారిగా ఆర్టీసీ బస్సులను అధికారులు గూడ్స్ రైలులో రవాణా చేశారు. Bharat Bandh: ఈనెల 25న భారత్ బంద్.. ఎందుకంటే..? బెంగళూరు, హోసూరులోని అశోక్ లేలాండ్…
వివాదాలు, రాజకీయాలకు దూరంగా ఉండే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారిపోయారు.. అది కూడా ఆయన ఓ రాజకీయ పార్టీ సమావేశాలకు హాజరు అవుతారని వార్త.. దానికి ప్రధాన కారణం.. ఆయన భారతీయ జనతా పార్టీ సమావేశానికి హాజరుకానున్నారంటూ.. ఓ ఎమ్మెల్యే ప్రకటన చేయడంతో.. రాహుల్ ద్రవిడ్ సోషల్ మీడియాను షేక్ చేశారు. చివరకు స్వయంగా ఈ వ్యవహారంపై టీమిండియా హెడ్ కోచ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. Read Also:…
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ్టితో ముగిసింది.. మరో మూడు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి.. ఇదే సమయంలో మరో ఎన్నికలకు సిద్ధం అవుతోంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఆరు రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఎన్నికలకు జరగనుండగా.. ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది.. అస్సాంలో 2, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 3, నాగాలాండ్ లో 1, త్రిపురలో 1, పంజాబ్లో 5 రాజ్యసభ స్థానాలు.. ఇలా మొత్తం 13 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్లో ఖాళీ…
విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక్కడి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో తమిళనాడుతో జరిగిన ఫైనల్లో 11 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఓపెనర్ శుభమ్ అరోరా అజేయ సెంచరీ (136)తో అదరగొట్టాడు. ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. అమిత్ కుమార్ 74, కెప్టెన్ రిషి ధవన్ 42 (నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 49.4 ఓవర్లలో…
హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐఏఎస్ అధికారులను బడి బాట పట్టించనుంది. ఇక నుంచి హిమచల్ ప్రదేశ్ అధికారులంతా సర్కారు బడికెళ్లి పాఠాలు బోధించాలి. తమ అనుభవాలను విద్యార్థులకు బోధించనున్నారు. భవిష్యత్ గురించి సరైన మార్గనిర్దేశనం చేయనున్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక వసతుల పరంగా ఏమైనా లోపాలున్నాయా… ? అని తెలుసుకునేందుకు హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీన్లో భాగంగా అఖిల భారత సర్వీసు(ఐఏఎస్)…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ సోమవారం ప్రముఖ టిబెటన్ బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. మెక్లీడ్గంజ్లోని దలైలామా నివాసంలో సుమారు గంట పాటు భేటీ కొనసాగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దలైలామా ఎవరితోనే ప్రత్యక్షంగా ఎవరినీ కలువ లేదు. ఈ నెల 15న నుంచి కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు. ప్రవాస టిబెటన్ ప్రభుత్వ అధ్యక్షుడు పెంపా తెర్సింగ్, ఆయన మంత్రివర్గం, టిబెటన్ పార్లమెంట్ స్పీకర్ సోనమ్ టెంఫెల్ కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ కలిశారు.…
రిజర్వేషన్లపై పలు సందర్భాల్లో నేతలు సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.. రిజర్వేషన్లతో బడుగు, బలహీన వర్గాలే మెజార్టీ ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకుంటున్నాయి.. ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాలు దక్కడం లేదని విమర్శలు ఉన్నాయి.. మరోవైపు.. వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని వాదిస్తారు.. అయితే, రిజర్వేషన్లపై హిమాచల్ప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శాంత కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తి రద్దు చేయాలన్న…