విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక్కడి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో తమిళనాడుతో జరిగిన ఫైనల్లో 11 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఓపెనర్ శుభమ్ అరోరా అజేయ సెంచరీ (136)తో అదరగొట్టాడు. ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. అమిత్ కుమార్ 74, కెప్టెన్ రిషి ధవన్ 42 (నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 49.4 ఓవర్లలో…
హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐఏఎస్ అధికారులను బడి బాట పట్టించనుంది. ఇక నుంచి హిమచల్ ప్రదేశ్ అధికారులంతా సర్కారు బడికెళ్లి పాఠాలు బోధించాలి. తమ అనుభవాలను విద్యార్థులకు బోధించనున్నారు. భవిష్యత్ గురించి సరైన మార్గనిర్దేశనం చేయనున్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక వసతుల పరంగా ఏమైనా లోపాలున్నాయా… ? అని తెలుసుకునేందుకు హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీన్లో భాగంగా అఖిల భారత సర్వీసు(ఐఏఎస్)…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ సోమవారం ప్రముఖ టిబెటన్ బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. మెక్లీడ్గంజ్లోని దలైలామా నివాసంలో సుమారు గంట పాటు భేటీ కొనసాగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దలైలామా ఎవరితోనే ప్రత్యక్షంగా ఎవరినీ కలువ లేదు. ఈ నెల 15న నుంచి కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు. ప్రవాస టిబెటన్ ప్రభుత్వ అధ్యక్షుడు పెంపా తెర్సింగ్, ఆయన మంత్రివర్గం, టిబెటన్ పార్లమెంట్ స్పీకర్ సోనమ్ టెంఫెల్ కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ కలిశారు.…
రిజర్వేషన్లపై పలు సందర్భాల్లో నేతలు సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.. రిజర్వేషన్లతో బడుగు, బలహీన వర్గాలే మెజార్టీ ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకుంటున్నాయి.. ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాలు దక్కడం లేదని విమర్శలు ఉన్నాయి.. మరోవైపు.. వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని వాదిస్తారు.. అయితే, రిజర్వేషన్లపై హిమాచల్ప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శాంత కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తి రద్దు చేయాలన్న…
దేశంలో ఈశాన్య రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కులు జిల్లా సైంజ్ వ్యాలీలో ఉన్న మజ్హన్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో పక్కపక్కనే ఉన్న 26 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు, 26 పశువుల కొట్టాలకు కూడా మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. Read Also: సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. వారిపై…
పోర్న్ సినిమాల కేసులో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత శిల్పాశెట్టి,రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా కనిపిం చారు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోని ఆలయాన్ని సందర్శించారు. ముంబై పోలీసులు జూలై 19న పోర్న్ చిత్రాల కేసు లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. సెప్టెంబర్లో ముంబై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుండి, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఉమ్మడిగా బహిరంగంగా కనిపించడం మానే శారు. ఈ జంట ఇటీవల…
కరోనా పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. క్రమంగా అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, విద్యా సంస్థలు అన్ని ఓపెన్ చేశారు.. కానీ, ఇప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్కడక్కడ కరోనా బారినపడడం కలవరానికి గురిచేస్తోంది.. మరో విషయం ఏటంటే.. హిమాచల్ప్రదేశ్లో నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 550 మందికిపైగా విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారి వెల్లడించారు.. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్…
మరికొద్ది రోజుల్లో శీతాకాలం ప్రారంభం కాబోతున్నది. శీతాకాలం ప్రారంభానికి ముందే హిమాలయ సానువుల్లోని గ్రామాల్లో మంచుకురవడం ప్రారంభం అయింది. జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లో ఇప్పటికే మంచు కురుస్తున్నది. దీంతో పర్యాటకులు ఆయా ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలోని ధన్కర్ గ్రామంలో విపరీతమైన మంచు కురిసింది. శీతాకాలం ప్రారంభానికి ముందే మంచు కురవడంతో గ్రామం మొత్తం తెల్లని దుప్పటి పరిచినట్టుగా మారిపోయింది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో…
సిమ్లాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయం అయ్యాయి. కొండలకు అనుకొని ఉన్న భవనాల్లో నివాసం ఉంటున్న ప్రజలు భయం భయంగా కాలం గడుపుతున్నారు. ఎప్పుడు కొండచరియలు విరిగిపడతాయో, ఎప్పుడు భవనాలు కూలిపోతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా పగుళ్ళు ఏర్పడిన ఓ 8 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. భవనానికి పగుళ్లు రావడంతో అందులో నివశిస్తున్న…
దేశంలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. గత రెండు మూడు రోజులుగా రోజుకు కోటి వరకు వ్యాక్సినేషన్లను అందిస్తున్నారు. ఆర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని, అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లను అందిస్తున్నామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దేశంలో 66…