ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ నిప్పులు కక్కుతున్నాడు. ఐఎండీ సూచనల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈసారి ఎక్కువ రోజులపాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. నేటి నుంచి 5రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం 10 గంటల నుంచే ఎంత తీవ్రత అధికంగా ఉంటుంది.
Heat Wave: ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం, వాతావారణ కాలుష్యం వెరిసి భూమి సగటు ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. దీంతో హిమనీనదాలు కరుగుతున్నాయి. కొన్నేళ్లలో అంటార్కిటికాలోని మంచు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని, దీంతో తీర ప్రాంతాల్లోని నగరాలకు ముప్పు ఉందని పరిశోధకలు హెచ్చరిస్తున్నారు.
Heat wave in America: ప్రస్తుతం అమెరికాలోని ప్రజలు విపరీతమైన వేడితో ఇబ్బంది పడుతున్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా వంటి నగరాల్లో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ దాటింది.
Deadly lightning : వర్షం వచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు చూసే ఉంటాం. అవి ఎలా వస్తున్నాయంటే రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు శబ్ధం, కాంతి వస్తుందని చాలా మంది చెబుతుంటారు.
Bihar : బీహార్లోని బక్సర్లో వేడిగాలుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా మూడో వ్యక్తి కూడా ఆసుపత్రిలో చేరాడు. భోజ్పూర్ జిల్లా దిఘా గ్రామానికి చెందిన రాజ్నాథ్ సింగ్ హీట్ స్ట్రోక్ కారణంగా మరణించినట్లు చెబుతున్నారు.
Bihar-UP Weather Alert: బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు వేడిగాలుల తాకిడికి అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటివరకు 100 మందికి పైగా వేడిగాలుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
దేశంలోని చాలా ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నంపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు సెగలు కక్కుతున్నాడు. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావానికి రాష్ట్రంలో మరోమారు తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.