Heat Wave: రానున్న రెండు రోజులు జాగ్రత్త.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వడగాలులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heat Wave: రానున్న రెండు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతతో పాటు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. తూర్పు, దీపకల్ప భారతదేశంలో వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఏప్రిల్ 9 వరకు ఈశాన్య ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ గంగానదీ పరివాహక ప్రాంతం, జార్ఖండ్, విదర్భ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలో ఈ రోజు, రేపు వడగాలుల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, గంగానది పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాం మీదుగా వేడిగాలుల పరిస్థితులు ఇప్పటికే కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. రాబోయే ఏడు రోజుల్లో సబ్-హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కింలో విస్తారంగా తేలికపాటి, మోస్తారు వర్షపాతం లేదా హిమపాతం కురుస్తుందని పేర్కొంది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Earthquake: న్యూయార్క్-న్యూజెర్సీలో భూకంపం.. 4.8 తీవ్రత నమోదు..
వడగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం బుధవారం సూచించింది. ప్రత్యేకించి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నందున పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉష్ణోగ్రత కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలపై సమీక్ష జరిపిన తర్వాత ఈ ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఏడాది దేశంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. దీనికి తగ్గట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెల్సియస్ దాటుతోంది. ఏప్రిల్ ప్రారంభంలోనే చాలా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘ఎల్ నినో’ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!