Heat Wave: రానున్న రెండు రోజులు జాగ్రత్త.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వడగాలులు..
Heat Wave: రానున్న రెండు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతతో పాటు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. తూర్పు, దీపకల్ప భారతదేశంలో వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఏప్రిల్ 9 వరకు ఈశాన్య ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ గంగానదీ పరివాహక ప్రాంతం, జార్ఖండ్, విదర్భ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలో ఈ రోజు, రేపు వడగాలుల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, గంగానది పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాం మీదుగా వేడిగాలుల పరిస్థితులు ఇప్పటికే కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. రాబోయే ఏడు రోజుల్లో సబ్-హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కింలో విస్తారంగా తేలికపాటి, మోస్తారు వర్షపాతం లేదా హిమపాతం కురుస్తుందని పేర్కొంది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Earthquake: న్యూయార్క్-న్యూజెర్సీలో భూకంపం.. 4.8 తీవ్రత నమోదు..
వడగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం బుధవారం సూచించింది. ప్రత్యేకించి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నందున పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉష్ణోగ్రత కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలపై సమీక్ష జరిపిన తర్వాత ఈ ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఏడాది దేశంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. దీనికి తగ్గట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెల్సియస్ దాటుతోంది. ఏప్రిల్ ప్రారంభంలోనే చాలా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘ఎల్ నినో’ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్
-
Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
-
Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్లు రద్దు!
-
Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
-
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!