Heat Wave: ప్రమాదం ముంగిట భారత్, పాక్ 220 కోట్ల మంది.. ఘోరమైన వేడితో ముప్పు..
Heat Wave: ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం, వాతావారణ కాలుష్యం వెరిసి భూమి సగటు ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. దీంతో హిమనీనదాలు కరుగుతున్నాయి. కొన్నేళ్లలో అంటార్కిటికాలోని మంచు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని, దీంతో తీర ప్రాంతాల్లోని నగరాలకు ముప్పు ఉందని పరిశోధకలు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కన్నా 2 డిగ్రీ సెల్సియస్ పెరిగే, ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్ లోని సింధూలోయలో నివసించే దాదాపుగా 220 కోట్ల ప్రజలను వేడి ఉక్కిరిబిక్కిరి చేయవచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పీర్ రివ్యూడ్ జర్నల్ లో ప్రచురితమైన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(పీఎన్ఏఎస్) పరిశోధన వెల్లడించింది. ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్, చైనా, సబ్-సహారా ఆఫ్రికాలు ప్రధానంగా అధిక తేమతో కూడిన వేడి గాలులకు ప్రభావితం అవుతాయని తెలిపింది.
Also Read
అధిక తేమ కలిగిన హీట్ వేవ్స్ చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే గాలి అధిక తేమను గ్రహించగలదు. ఈ పరిమితి మానవ శరీరం చమటలు త్వరగా ఆవిరయ్యే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తర్వాత చమట త్వరగా ఆవిరి కాకపోవడంతో శరీర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉండదు. పరిశోధనలో చెప్పబడిన ప్రాంతాలు తక్కువ-మధ్య ఆదాయ దేశాలు కావడంతో ఏసీలు లేదా ఉష్ణోగ్రతలు తగ్గించే పరికరాలను వాడే స్థోమత ఉండకపోవడ పోవచ్చని పరిశోధకులు తెలిపారు.
Read Also: Israel-Hamas War: హమాస్ కీలక కమాండర్ని హతమార్చిన ఇజ్రాయిల్.. మిగతా వారికి ఇదే గతని వార్నింగ్..
సాధారణంగా మానవులు తేమ, వేడి కలయికను కొంతవరకు మాత్రమే భరించగలడు. ఈ పరిమితిని దాటినప్పుడు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. వడదెబ్బ, గుండెపోటు వంటి వాటికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. భూమి యెక్క ప్రపంచ ఉపరిత ఉష్ణోగ్రతలు ఇప్పటికే 1.15 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. పారిశ్రామిక విప్లవం తరువాత అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేశాయి.
2015లో 196 దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక విప్లవం పూర్వస్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్(ఐపీసీసీ) ప్రకారం.. ఈ శతాబ్ధం చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు దాదాపుగా 3 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలకు దారి తీయచ్చని అంచనా వేసింది. సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే 2019 స్థాయిలతో పోలిస్తే, 2030లో ఉద్గారాలను సగానికి తగ్గించాలని ఐపీసీసీ చెప్పింది. తాజాగా పరిశోధనలు చేసిన బృందం 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగితే ఏలాంటి ప్రభావం ఉంటుందని పరిశోధనలు
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!