ఢిల్లీకి చెందిన పాలసీ పరిశోధకురాలు స్నేహ సిన్హాకు ఇటీవల యాపిల్ వాచ్ 7 బహుమతిగా లభించింది. ఇది చాలా ఫ్యాషన్గా, ట్రెండీగా ఉండడంతో ఆమెకు అది బాగా నచ్చింది. దాంతో ఆమె వాచ్ ధరించడం ప్రారంభించింది. ఆపిల్ వాచ్ 7లోని ఖచ్చితమైన ‘హార్ట్ రేట్ మానిటర్’ ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని ఆమె యాపిల్ సీఈవో టిమ్ కుక్ కి తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు. Also Read: Chinaman: కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా…
Summer Heat: ఈ ఏడాది వేసవి కాలంలో ఎండల తీవ్రం గతంలో పోలిస్తే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
మీరు డబ్బుతో కొనలేనిది లేదా ఏ చికిత్స ద్వారా తిరిగి పొందలేనిది ఈ ప్రపంచంలో వయస్సు మాత్రమే. వయస్సు దాటిన తర్వాత తిరిగి దానిని ఈ ప్రపంచంలో ఎవరూ తిరిగి పొందలేరు. అందువల్ల, ప్రతి వ్యక్తి తన జీవితం సుదీర్ఘంగా ఉండాలని కోరుకుంటాడు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఈ రోజున ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ రోజును జరుపుకుంటారు.
కిడ్నీలో రాళ్లు.. ఇది చాలామందిలో ఈ సమస్య కనిపిస్తుంది. కిడ్నీలో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్లేప్పుడు విపరీతమైన మంట వస్తూ ఉంటుంది. రాళ్ల పరిమాణం, సంఖ్యను బట్టి కిడ్నీలో రాళ్లు రావడానికి చాలా వారాలు, నెలలు పట్టవచ్చు.
ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడిపండ్లు మార్కెట్లలో నిగనిగ మెరుస్తూ ఉంటాయి. మామిడి పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే.. మామిడిపండ్లు తియ్యగా ఉండటం వల్ల పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే మామిడిని 'పండ్లలో రారాజు' అని అంటారు. అయితే.. ఉగాది తర్వాత మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఇక సీజన్ ప్రారంభంలో ఎక్కువగా పచ్చిమామిడి కాయలు లభిస్తాయి. వాటితో చాలా మంది పచ్చడి తయారు చేసుకుంటారు. మరి కొంతమంది పచ్చికాయలను కోసి ఆ ముక్కలపై…
ఓ అధ్యయనంలో కీలక విషయం బయటపడింది. రోజు తినే ఆహారాన్ని 8 గంటల వ్యవధికి పరిమితం చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చి చనిపోయే ప్రమాదం 91శాతం పెరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) తెలిపింది. ఈ నివేదిక విడుదలకు ముందు ఇతర నిపుణులతో ఈ విషయాన్ని ఏహెచ్ఏ బయటపెట్టింది. ఈరోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసమని, దేవుడి పూజలో పాల్గొనందున అడపాదడపా ఉపవాసం చేస్తున్నారు. మరోవైపు.. బరువుతగ్గడం కోసం ఇతర రకాల మెడిసిన్స్ కూడా వాడుతున్నారు.…
ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలి ప్రజలను అనేక సమస్యలకు గురిచేస్తోంది. పెరుగుతున్న పని ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మన నిద్రను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమికి గురవుతున్నారు.
మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన భాగం. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక విధులను నిర్వహిస్తాయి. కిడ్నీలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా, మూత్రపిండాలు మన రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.