Intermittent Fasting: అడపదడపా ఉపవాసంతో జాగ్రత్త.. గుండెపోటు వచ్చే అవకాశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ అధ్యయనంలో కీలక విషయం బయటపడింది. రోజు తినే ఆహారాన్ని 8 గంటల వ్యవధికి పరిమితం చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చి చనిపోయే ప్రమాదం 91శాతం పెరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) తెలిపింది. ఈ నివేదిక విడుదలకు ముందు ఇతర నిపుణులతో ఈ విషయాన్ని ఏహెచ్ఏ బయటపెట్టింది. ఈరోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసమని, దేవుడి పూజలో పాల్గొనందున అడపాదడపా ఉపవాసం చేస్తున్నారు. మరోవైపు.. బరువుతగ్గడం కోసం ఇతర రకాల మెడిసిన్స్ కూడా వాడుతున్నారు. అయితే.. ఉపవాసం చేయడం వల్ల గుండెపోటు మరణాలకు దారితీస్తుందనే అధ్యయన నివేదికపై కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
YCP Bus Yatra Schedule: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే..!
Also Read
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
- Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
- RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
మరోవైపు.. కాలపరిమితితో కూడిన ఆహారం క్యాలరీలను తగ్గిస్తుందని యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లోని హ్యూమన్ మెటబాలిజం ఎమెరిటస్ ప్రొఫెసర్ కీత్ ఫ్రాయిన్ తెలిపారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్కు చెందిన నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో.. షాంఘై జియావో టోంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన విక్టర్ జాంగ్ నేతృత్వంలోని పరిశోధకులు సుమారు 20,000 మంది పాల్గొని డేటాను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో 2003 నుంచి 2019 వరకు మరణాల డేటా, పలు అంశాలకు సమాధానాలను పరిశీలించింది. రెండు రోజుల క్రితం ఏం తిన్నారనేది తెలుసుకోవడం కోసం ప్రశ్నావళిలో భాగం చేశారు. అయితే.. ఇందులో లోపాలకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో సగం మంది పురుషులు ఉన్నారు. వారి సగటు వయస్సు 48 ఏళ్లు.
Bachhala Malli : సరికొత్త కథాంశంతో వస్తున్న అల్లరి నరేష్ బచ్చల మల్లి..
ఈ అధ్యయనంలో.. అడపాదడపా ఉపవాసాన్ని ఎంతకాలం కొనసాగించారనేది స్పష్టంగా తెలియనప్పటికీ వారు దానిని అనుసరించారని పరిశోధకులు భావించారని పరిశోధకుడు జాంగ్ తెలిపారు. అయితే.. ఉపవాసం ఉన్న వారిలో అధికంగా బీఎంఐ, ఆహార అభద్రత కలిగిన యువకులు ఎక్కువగా ఉన్నారు… ఈ నివేదికల ఆధారంగా వారికి రక్తపోటు, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ముప్పు తక్కువగా ఉంది… డేటా విశ్లేషణలో అన్ని అంశాలను మేము నియంత్రించాం.. అయితే ఆహారం తీసుకునే వ్యవధిని 8 గంటలకు పరిమితం చేయడం, గుండెపోటు మరణాల మధ్య సానుకూల సంబంధం ఉంది’ అని జాంగ్ తెలిపారు.
తాజావార్తలు
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
-
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
-
Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
-
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!