టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మగా అద్భుతంగా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ ఎం ఎస్ ఐడీసీ, అలాంటి సంస్థకు ఛైర్మగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎర్రోళ్ల శ్రీను కు నా అభినందనలు అని వైద్యాఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.…
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు రైతుల పక్షాన ఢిల్లీ వచ్చారని… మంత్రులను కలిసేందుకు సమయం లేదు.. కానీ, బీజేపీ నేతలను మాత్రం కలుస్తారా? అని నిలదీశారు. రాజకీయం చేస్తున్నది బీజేపీ పార్టీ అని హరీష్రావు మండిపడ్డారు. మంత్రులను పట్టుకొని పనిలేదని అంటారా? ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి…
సిద్ధిపేటలో మంత్రి హరిష్ రావు తడి చెత్తతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ర్టంలో తొలిసారి ఈ తరహా ప్లాంట్ను సిద్ధిపేటలోనే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తడిచెత్త నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. తడిచెత్తలో వచ్చే సూదులు, శానిటరీ ప్యాడ్లు, ఔషధ వ్యర్థాల దహనానికి ప్రత్యేక యంత్రం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. స్థానికంగా యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. సిద్ధిపేటను అన్ని…
ఉస్మానియా ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.7కోట్లతో క్యాథ్ల్యాబ్, సిటీ స్కాన్ లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా మరో నాలు క్యాథ్ ల్యాబ్లను అందుబాటులోకి తీసువస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య అందేలా ఏర్పాటు చేస్తున్నామని, ఉస్మానియా అస్పత్రిలో రూ.5 కోట్లతో అధునాతన మార్చురీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాత్రి పూట పోస్టుమార్టం చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన అన్నారు.…
గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యూనిట్ ను ఇవాళ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… MRI, cathalab సెంటర్లను 45 రోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా తెలంగాణలోకి రాలేదన్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన అనుమానితులకు 13 మందికి నెగటివ్ వచ్చిందని….రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతామన్నారు. కరోనా సమయంలో…
సిద్ధిపేట డిగ్రీ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి హరీష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ప్రాముఖ్యమైందన్నారు. కాగా మొదటి సారి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందని తెలిపారు. జిల్లాలో దాదాపు 99 శాతం ఓటింగ్ జరుగుతుందని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని చేసినా…
2009,డిసెంబర్ 9ని తెలంగాణ ప్రజలు ఎవ్వరూ మర్చిపోరు.తెలంగాణ అస్థిత్వానికి గుర్తింపు లభించిన రోజు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో కేంద్రం తలదించక తప్పని రోజు. తాను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ దీక్ష బలంగా మారి యావత్ దేశాన్ని తెలంగాణ వైపు తిప్పేలా చేసిన రోజు. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం గంటల తరబడి కేసీఆర్ దీక్షపై చర్చలు జరిపింది. రాత్రి అయినా తెలంగాణ పై…
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులలో తయారు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రుల్లో రూ.12 కోట్ల విలువైన ఆధునిక పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ పరికరాలు సామాన్యుల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జన్యు లోపాలపై ఆధునిక వైద్యం, బోన్ లోపాలు ముందే తెలుసుకునే ఆధునిక పరికరాలను ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి ఏర్పాటు చేశామని తెలిపారు. నిమ్స్లో 155 ICU బెడ్స్ అందుబాటులో…
ఒమిక్రాన్ వేరియంట్పై, ప్రస్తుత కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు సమీక్ష నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చిన 13 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను, వ్యాక్సినేషన్ను అధికారులు మంత్రి హరీష్రావుకు వివరించారు. Read: పెళ్లి మండపంలోకి దూరి పెళ్లికూతురి…
ఆందోళన వద్దు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రజలకు ధైర్యాన్ని చెప్పారు మంత్రి హరీష్రావు.. ఇవాళ బాలానగర్ ఫిరోజ్ గూడలో బస్తీ దావాఖానను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్ర పటానికి నివాళులర్పించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు భయపడుతున్నారు.. కానీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు…