కరోనా కట్టడికి నాయకులు, అధికారులు కలిసి పని చేయాలి: మంత్రి హరీష్రావు
కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వేను రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంగతి తెల్సిందే.. సిద్ధిపేట పట్టణంలోని పలువార్డుల్లో ఇంటింటి ఫీవర్ సర్వేలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలోని అదరిని టీకా తీసుకున్నారా లేదా అని మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి నాయకులు, అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. నిన్న ఒక్క రోజే 12 లక్షల మందికి పరీక్షలు చేశారు వైద్యాధికారులు. హోమ్ కిట్ ద్వారా కరోనా లక్షణాలు పోతున్నాయని మంత్రి తెలిపారు. ప్రతిరోజు వారీ ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అన్ని రకాల వైద్యం చేస్తారన్నారు. 5 నుండి 8 వారాలు ఈ సర్వే చేయిస్తారని మంత్రి తెలిపారు. లైన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరిన్ని సెంటర్లను పెంచుతామని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: ఆర్ఎఫ్సీఎల్లో సాంకేతికలోపం.. కరోనా కారణంగా ఉత్పత్తి నిలిపివేత
Also Read
మందుల ద్వారా కరోనాను ఎదుర్కొగలిగినప్పటికీ ప్రతి రోజు సర్వే చేస్తున్నాం, నీతి ఆయోగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సర్వే పట్ల సంతోషం వ్యక్తం చేసిందని మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. పిల్లలు కోసం ప్రత్యేక, పెద్దల కోసం ప్రత్యేక వార్డులను లాంఛనంగా ఏర్పాటు చేశామన్నారు.కోటికి పైగా హోమ్ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. ప్రతి గ్రామంలో కిట్లను రెడీ చేశాం. ప్రజల ఆరోగ్యం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 370 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెడీగా ఉంచాం. రాష్ర్టంలో ఎక్కడ కూడా డాక్టర్లు ఖాళీ లేకుండా ఖాళీలను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి వెల్లడించారు. ప్రజలు ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆశా కార్యకర్తలకు సమాచారం అందించి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, దీనివల్ల ఎలాంటి ప్రాణ హాని ఉండదని మంత్రి తెలిపారు. సర్వేలో పాల్గొన్న అధికారులందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!