ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్లేఆఫ్స్ రేసులో తొలి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొనబోతున్నది. ఆడిన 8 మ్యాచ్లలో ఆరు గెలిచిన గుజరాత్ను అడ్డుకోవడం ఢిల్లీ టీమ్ కి ప్రస్తుతానికైతే శక్తికి మించిన పనే అని తెలుస్తోంది.
జట్టుకు భారంగా మారాడని హార్థిక్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అతను చివరిసారిగా ఎప్పుడు జట్టుకు ఉపయోగపడే ఇన్సింగ్స్ ఆడాడో కనీసం అతనికైనా గుర్తుందా అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు. రెండు, మూడు మ్యాచ్ లు పక్కన కూర్చోబెడితే కానీ లైన్ లోకి వచ్చేలా కనిపించడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్-16వ సీజన్లో భాగంగా నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి పంజాబ్పై పోరాడి ఓడిన రోహిత్ సేన గుజరాత్పై తప్పనిసరిగా గెలవాలనే కసితో ఉంది.
పంజాబ్ కింగ్స్ తో ఉత్కంఠ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అయితే పాండ్యా ఆనందం కాసేపైనా లేకుండా పోయింది. నిర్ణీత టైంలో ఇన్సింగ్స్ ను పూర్తి చేయని కెప్టెన్ లకు ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానాలు విధిస్తున్నారు.