డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హమాస్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేయాలి.. అలా జరగకపోతే మిలిటెంట్ గ్రూప్ హమాస్కు నరకం చూపిస్తానని అతడు హెచ్చరించారు.
హమాస్ అంతమే లక్ష్యంగా నూతన సంవత్సరం వేళ కూడా ఇజ్రాయెల్ వేట సాగిస్తోంది. న్యూఇయర్ వేళ జరిపిన దాడుల్లో పదుల కొద్దీ చనిపోగా.. ఇక తాజాగా జరిగిన దాడుల్లో హమాస్ అగ్ర అధికారులతో సహా 10 మంది చనిపోయారు.
Israel-Hamas Conflict: ఇజ్రాయెల్- హమాస్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామం జరిగింది. ఖతార్కు చెందిన అల్జజీరా వార్తా సంస్థపై పాలస్తీనా నిషేధం విధించింది.
Israel: 2023 అక్టోబర్ 07న హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఇజ్రాయిల్లోకి చొరబడి దారుణమై దాడి చేశారు. సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ కమ్యూనిటీలను టార్గెట్ చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా దారుణంగా చంపేశారు. పడుకొని ఉన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. అత్యంత కిరాతకంగా ఇజ్రాయిలీలను హతమార్చారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోగా, 251 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం హమాస్ లక్ష్యంగా గాజాతో పాటు ఇతర…
Hamas Attack On Israel: అక్టోబర్ 07, 2023న గాజాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై భీకర దాడి చేశారు. ఒకేసారి వందలాది రాకెట్లను ప్రయోగించడంతో పాటు హమాస్ మిలిటెంట్ ఇజ్రాయిల్ కంచెను దాటి సరిహద్దు గ్రామాల్లో మారణహోమం సృష్టించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందర్ని దారుణంగా చంపేశారు.
Israel: హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను జులైలో హత్య చేసింది తామేనని ఇజ్రాయెల్ తాజాగా ధ్రువీకరించింది. టెల్అవీవ్ రక్షణ మంత్రి కాట్జ్ ఈ విషయాన్ని తెలిపారు.
Iran Supreme Leader: హమాస్, హెజ్బొల్లా, ఇస్లామిక్ జిహాద్లు తమ ముసుగు సంస్థలు కావు.. అవి స్వచ్ఛందంగా పోరాటం చేస్తున్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ వెల్లడించారు.
పశ్చిమాసియాలో ఇంకా యుద్ధం కొనసాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా జరిగిన దాడిలో 69 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని పాలస్తీనా పౌరులు భయంతో గడుపుతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్లోని పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న నాలుగు పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 69 మంది పౌరులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. గాయపడినవారిలో జర్నలిస్టులు, పాలస్తీనా సివిల్ డిఫెన్స్కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. మరోవైపు సిరియాలో సోమవారం…
Gaza: ఇజ్రాయెల్ ఆధినంలో ఉన్న గాజాలోని పాలస్తీనియన్లు పడుతున్న బాధలు అంతులేని అగచాట్లకు నిదర్శనం అని చెప్పాలి. కనీసం ఆహారం దొరక్క వాళ్లు అల్లాడిపోతున్నారు. శుక్రవారం నాడు ఖాన్యూనిస్లోని శరణార్థి శిబిరం దగ్గర ఫ్రీగా ఆహార పంపిణీ చేసే కేంద్రం వద్ద పాలస్తీనా మహిళలు, బాలికలు ఫుడ్ కోసం పెద్ద యుద్ధమే చేశారు.