Gaza Ceasefire: ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్
- ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం.
- విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్.
- సోషల్ మీడియా ద్వారా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నోట్ విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza Ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఒప్పందం తర్వాత గాజాలో శాంతి, మానవతా సహాయం పెరుగుతాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. గాజాలో బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనను స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది గాజా ప్రజలకు సురక్షితమైన, నిరంతర మానవతా సహాయం అందించడానికి దారి తీస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. అన్ని రకాల బందీల విడుదల, కాల్పుల విరమణ, సంభాషణలు, దౌత్య మార్గానికి తిరిగి రావాలని నిరంతరం పిలుపునిచ్చామని తెలిపింది.
Also Read: Fishermen Released: శ్రీలంక జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
మొదట అక్టోబర్ 7, 2023న, హమాస్ ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాలను హమాస్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. అంతే కాకుండా 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. దీని తర్వాత ఇజ్రాయెల్ గాజాపై దాడి చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటివరకు 45 వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఈ నేపథ్యంలోనే గాజాలోని పెద్ద ప్రాంతాలు శిథిలావస్థకు చేరాయి. గాజాలో ఉన్న 23 లక్షల జనాభాలో ఇప్పుడు ఏకంగా 90 శాతం మంది నిర్వాసితులయ్యారు. అలాగే చాలామంది ప్రజలు ఆకలి చావులు ఎదుర్కొంటున్నారు.
https://twitter.com/MEAIndia/status/1879752154661171615
Also Read: ISRO: కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో.. డాకింగ్ ప్రక్రియ విజయవంతం
ఖతార్ రాజధానిలో వారాల తరబడి గట్టి చర్చల అనంతరం కుదిరిన ఒప్పందంలో పలు షరతులను విధించారు. బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ వ్యక్తులను దశలవారీగా విడుదల చేసేందుకు హమాస్ అంగీకారం తెలిపింది. వందలాది మంది పాలస్తీనా ఖైదీలను తన చెర నుంచి విడుదల చేసేందుకు కూడా ఇజ్రాయెల్ అంగీకరించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. 8 నెలల నిరంతర చర్చల తర్వాత కాల్పుల విరమణ, బందీల ఒప్పందాన్ని అంగీకరించడంలో పరిపాలన విజయం సాధించింది. ఈ ఒప్పందం మూడు దశల్లో అమలు కానుంది. ఈ ఒప్పందం జనవరి 19, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఈ పక్రియను మొత్తం మూడు దశల్లో శాంతిని తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పని చేస్తామని ఈ దేశాలు హామీ ఇచ్చాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!