Gaza Ceasefire: ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్
- ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం.
- విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్.
- సోషల్ మీడియా ద్వారా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నోట్ విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza Ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఒప్పందం తర్వాత గాజాలో శాంతి, మానవతా సహాయం పెరుగుతాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. గాజాలో బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనను స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది గాజా ప్రజలకు సురక్షితమైన, నిరంతర మానవతా సహాయం అందించడానికి దారి తీస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. అన్ని రకాల బందీల విడుదల, కాల్పుల విరమణ, సంభాషణలు, దౌత్య మార్గానికి తిరిగి రావాలని నిరంతరం పిలుపునిచ్చామని తెలిపింది.
Also Read: Fishermen Released: శ్రీలంక జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు
Also Read
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
మొదట అక్టోబర్ 7, 2023న, హమాస్ ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాలను హమాస్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. అంతే కాకుండా 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. దీని తర్వాత ఇజ్రాయెల్ గాజాపై దాడి చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటివరకు 45 వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఈ నేపథ్యంలోనే గాజాలోని పెద్ద ప్రాంతాలు శిథిలావస్థకు చేరాయి. గాజాలో ఉన్న 23 లక్షల జనాభాలో ఇప్పుడు ఏకంగా 90 శాతం మంది నిర్వాసితులయ్యారు. అలాగే చాలామంది ప్రజలు ఆకలి చావులు ఎదుర్కొంటున్నారు.
https://twitter.com/MEAIndia/status/1879752154661171615
Also Read: ISRO: కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో.. డాకింగ్ ప్రక్రియ విజయవంతం
ఖతార్ రాజధానిలో వారాల తరబడి గట్టి చర్చల అనంతరం కుదిరిన ఒప్పందంలో పలు షరతులను విధించారు. బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ వ్యక్తులను దశలవారీగా విడుదల చేసేందుకు హమాస్ అంగీకారం తెలిపింది. వందలాది మంది పాలస్తీనా ఖైదీలను తన చెర నుంచి విడుదల చేసేందుకు కూడా ఇజ్రాయెల్ అంగీకరించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. 8 నెలల నిరంతర చర్చల తర్వాత కాల్పుల విరమణ, బందీల ఒప్పందాన్ని అంగీకరించడంలో పరిపాలన విజయం సాధించింది. ఈ ఒప్పందం మూడు దశల్లో అమలు కానుంది. ఈ ఒప్పందం జనవరి 19, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఈ పక్రియను మొత్తం మూడు దశల్లో శాంతిని తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పని చేస్తామని ఈ దేశాలు హామీ ఇచ్చాయి.
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్పాల్ యాదవ్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!