Gaza Ceasefire: ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్
- ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం.
- విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్.
- సోషల్ మీడియా ద్వారా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నోట్ విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza Ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఒప్పందం తర్వాత గాజాలో శాంతి, మానవతా సహాయం పెరుగుతాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. గాజాలో బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనను స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది గాజా ప్రజలకు సురక్షితమైన, నిరంతర మానవతా సహాయం అందించడానికి దారి తీస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. అన్ని రకాల బందీల విడుదల, కాల్పుల విరమణ, సంభాషణలు, దౌత్య మార్గానికి తిరిగి రావాలని నిరంతరం పిలుపునిచ్చామని తెలిపింది.
Also Read: Fishermen Released: శ్రీలంక జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు
Also Read
మొదట అక్టోబర్ 7, 2023న, హమాస్ ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాలను హమాస్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. అంతే కాకుండా 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. దీని తర్వాత ఇజ్రాయెల్ గాజాపై దాడి చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటివరకు 45 వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఈ నేపథ్యంలోనే గాజాలోని పెద్ద ప్రాంతాలు శిథిలావస్థకు చేరాయి. గాజాలో ఉన్న 23 లక్షల జనాభాలో ఇప్పుడు ఏకంగా 90 శాతం మంది నిర్వాసితులయ్యారు. అలాగే చాలామంది ప్రజలు ఆకలి చావులు ఎదుర్కొంటున్నారు.
https://twitter.com/MEAIndia/status/1879752154661171615
Also Read: ISRO: కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో.. డాకింగ్ ప్రక్రియ విజయవంతం
ఖతార్ రాజధానిలో వారాల తరబడి గట్టి చర్చల అనంతరం కుదిరిన ఒప్పందంలో పలు షరతులను విధించారు. బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ వ్యక్తులను దశలవారీగా విడుదల చేసేందుకు హమాస్ అంగీకారం తెలిపింది. వందలాది మంది పాలస్తీనా ఖైదీలను తన చెర నుంచి విడుదల చేసేందుకు కూడా ఇజ్రాయెల్ అంగీకరించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. 8 నెలల నిరంతర చర్చల తర్వాత కాల్పుల విరమణ, బందీల ఒప్పందాన్ని అంగీకరించడంలో పరిపాలన విజయం సాధించింది. ఈ ఒప్పందం మూడు దశల్లో అమలు కానుంది. ఈ ఒప్పందం జనవరి 19, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఈ పక్రియను మొత్తం మూడు దశల్లో శాంతిని తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పని చేస్తామని ఈ దేశాలు హామీ ఇచ్చాయి.
తాజావార్తలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!