Bunker Buster Bomb: ఇజ్రాయిల్, హమాస్ మధ్య మరోసారి యుద్ధం ప్రారంభమైంది. ఇటీవల వారం రోజుల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, సంధి కుదిరింది. హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయిల్ బందీలను వదిలేయగా.. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే తాజాగా సంధి ముగియడంతో మరోసారి యుద్ధం ప్రారంభమైంది. అయితే సంధి కాలంలో గాజాస్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ పైకి దాడి జరిగింది, దీని వల్లే…
Israel-Hamas: హమాస్ దాడి తర్వాత ఆ సంస్థను పూర్తిగా అంతం చేసేందుకు ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు పావులు కదుపుతున్నారు. మాజీ ప్రధాని గోల్డా మీర్ అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నారు. ఇజ్రాయిల్ తన శత్రువులను చంపేందుకు ‘ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్’ లాంటి మిషన్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే హమాస్ కీలక నేతల్ని చంపేందుకు నెతన్యాహు ఇజ్రాయిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మొసాద్’ని ఆదేశించారు. ప్రస్తుతం హమాస్ కీలక నాయకత్వం…
Israel-Hamas War: ఇన్నాళ్లు ఉత్తర గాజా ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ, ఇప్పుడు హమాస్ని పూర్తిగా నిర్మూలించడానికి దక్షిణ గాజాపై కూడా ఫోకస్ చేసింది. దక్షిణ గాజా లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళం దాడులు చేసింది. శనివారం జరిగిన ఈ దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గతంలో ఉత్తరగాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ గాజా ప్రజలను హెచ్చరించింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా స్ట్రిప్పై భూతల దాడి చేస్తున్న ఇజ్రాయిల్ బలగాలు హమాస్ వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు గాజాను అదుపులోకి తీసుకునేందుకు ఆపరేషన్స్ చేపడుతోంది. ముఖ్యంగా గాజాలోని ఉత్తర ప్రాంతంపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే హమాస్ పార్లమెంట్తో పాటు హమాస్ నియంత్రణలో ఉన్న ఓడరేవును ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది.
Israel-Hamas War: గాజాపై ఇజ్రాయిల్ సైన్యం పట్టు సాధిస్తోంది. హమాస్ వ్యవస్థను నేలమట్టం చేసేందుకు ఉత్తర గాజాను ముఖ్యగా గాజా నగరాన్ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చుట్టుముట్టింది. గాజాలో భూతల దాడుల ద్వారా హమాస్ ఉగ్రస్థావరాలను నేలకూల్చుతోంది. ముఖ్యంగా హమాస్ ఉగ్రవాదులకు, వారి టన్నెట్ వ్యవస్థకు రక్షణగా ఉన్న ఇజ్రాయిల్ లోని పలు ఆస్పత్రులను ఐడీఎఫ్ చుట్టుముట్టింది. ముఖ్యంగా అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ టార్గెట్ చేస్తోంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేశారు. ఈ దాడిలో 1400 మంది ఊచకోత కోశారు, మరో 200 మంది వరకు ప్రజల్ని బందీలుగా చేసుకుని గాజా ప్రాంతంలోకి తరలించారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్ పై తీవ్రంగా దాడులు చేస్తోంది. హమాస్ని నేలకూల్చే వరకు విశ్రమించేంది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. హమాస్ ఉగ్రస్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది.…
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ మొదలై నెల రోజులు గడిచాయి. హమాస్ ను పూర్తిగా నేలమట్టం చేసేదాకా విశ్రమించేంది లేదని స్పష్టం చేసింది. అయితే గాజాలోని ఆస్పత్రులను ఇజ్రాయిల్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఆర్మీ చుట్టుముట్టింది. ఆస్పత్రులను హమాస్ కమాండ్ సెంటర్ గా వాడుకుంటోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అందుకే వాటిని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అల్ షిఫా ఆస్పత్రి చుట్టు ఇజ్రాయిల్ తన ట్యాంకుల్ని మోహరించింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం గాజాను అంధకారంలో పడేసింది. హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయిల్ దాడులు అక్కడి సాధారణ ప్రజానీకాన్ని కష్టాలపాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ వరసగా దాడులను తీవ్రతరం చేయడంతో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిలో సేవలు స్తంభించాయి. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రైన అల్ షిఫా మెడికల్ కాంప్లెక్స్పై ఇజ్రాయిల్ దాడి చేసిందని హమాస్ ఆధ్వర్యంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంధనం లేక చివరి జనరేటర్ కూడా నిలిచిపోయిందని ఓ పసికందు సహా ఐదుగురు రోగులు ప్రాణాలు…
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి అక్కడి ప్రజల్ని క్రూరంగా ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది చనిపోయారు. 200 మందిని బందీలుగా హమాస్ మిలిటెంట్లు గాజాలోకి పట్టుకెళ్లారు. హమాస్ చేసిన పని ప్రస్తుతం గాజాలోని పాలస్తీనియన్ల పాలిట నరకంగా మారింది. ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై జరిపిన దాడిలో 10,500 మందికి పైగా మరణించారు.
Isreal-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విభజన తీసుకువచ్చింది. కొన్ని దేశాలు ఇజ్రాయిల్కి మద్దతు తెలుపుతుండగా.. మరికొన్ని దేశాలు పాలస్తీనా, హమాస్ మిలిటెంట్లకు మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయిల్కి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇదిలా ఉంటే యూఎస్ ప్రతినిధుల సభలో పార్టీల మధ్య ఈ అంశం చీలిక తీసుకువచ్చింది. అమెరికా ప్రతినిధుల సభలో ఏకైక పాలస్తీనియన్- అమెరికన్ అయిన రషీదా త్లైబ్ చేసిన వ్యాఖ్యలపై సభ సెన్సార్ విధించింది. ఆమె వ్యాఖ్యల్ని సభ ఖండించింది.…