Israel-Hamas War: శ్మశానాలు నిండిపోయాయి.. ఫుట్బాల్ మైదానంలో మృతుల ఖననం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి అక్కడి ప్రజల్ని క్రూరంగా ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది చనిపోయారు. 200 మందిని బందీలుగా హమాస్ మిలిటెంట్లు గాజాలోకి పట్టుకెళ్లారు. హమాస్ చేసిన పని ప్రస్తుతం గాజాలోని పాలస్తీనియన్ల పాలిట నరకంగా మారింది. ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై జరిపిన దాడిలో 10,500 మందికి పైగా మరణించారు.
ముఖ్యంగా గాజా నగరంతో పాటు ఉత్తర గాజాలోని చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయిల్ ప్రస్తుతం భూతల దాడులను కూడా నిర్వహిస్తోంది. గాజాలో తాగునీరు, వైద్యం, ఆహారం, కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. ఇదిలా ఉంటే లెక్కకు మించి ప్రజలు చనిపోతుండటంతో మృతదేహాలను పాలిపెట్టేందుకు కనీసం చోటు కూడా లభించడం లేదు.
Also Read
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
చాలా ప్రాంతాల్లో శ్మశానాలు నిండిపోయాయి. దీంతో ప్రజలు వారి తోటల్లో చనిపోయిన పిల్లల్ని పాతిపెడుతున్నారు. మహమూద్ అల్ మస్రీ అనే వ్యక్తి తన ముగ్గురు సోదరులను, వారి ఐదుగురు పిల్లల్ని సమీపంలోని సిట్రస్ తోటలో పాతిపెట్టారు. శ్మశాన వాటిక సరిహద్దు జోన్ లో ఉండటంతో పండ్ల తోటలో పాతిపెట్టాల్సి వచ్చిందని మస్రీ వెల్లడించారు.
Read Also: Bigg Boss Telugu 7: అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియదు.. ఏడిపించేసిన యావర్ బ్రదర్స్
ఇప్పటికీ చాలా మృతదేహాలను ఆస్పత్రుల వెలుపల, రోడ్లపై, పార్కుల్లో, ఐస్ క్రీములను తీసుకెళ్లే ట్రక్కుల్లో ఉంచుతున్నారు. ఇవి చాలకపోవడంతో గాజాలోని ఫుట్బాల్ మైదానంలో సామూహికంగా ఖననం చేయాల్సి వస్తోంది. కార్లలో నింపుకునేందుకు ఇంధనం లేకపోవడంతో గాడిద బండ్లలో మృతదేహాలను తీసుకెళ్లే దయనీయ పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే ఇజ్రాయిల్ ఉత్తర గాజాను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు సూచించింది. లేకపోతే హమాస్ మిలిటెంట్లు ప్రజల్ని రక్షణ కవచాలుగా వాడుకునే అవకాశం ఉందని తెలిపింది. దీంతో లక్షల్లో ప్రజలు గాజా దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లారు. యుద్ధం పాలస్తీనా ప్రజలకు మానవతా సంక్షోభాన్ని మిగుల్చుతోంది. 50,000 మంది కేవలం 4 టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?