Israel-Hamas War: దక్షిణ గాజాపై ఇజ్రాయిల్ దాడుల్లో 32 మంది మృతి.. అల్ షిఫా నుంచి పారిపోతున్న రోగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇన్నాళ్లు ఉత్తర గాజా ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ, ఇప్పుడు హమాస్ని పూర్తిగా నిర్మూలించడానికి దక్షిణ గాజాపై కూడా ఫోకస్ చేసింది. దక్షిణ గాజా లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళం దాడులు చేసింది. శనివారం జరిగిన ఈ దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గతంలో ఉత్తరగాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ గాజా ప్రజలను హెచ్చరించింది. లక్షలాది మంది ప్రాణాలు చేత పట్టుకుని దక్షిణ ప్రాంతానికి వెళ్లారు. అయితే ఇప్పడు దక్షిణ గాజాపై కూడా దాడులు మొదలయ్యాయి. 4 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఖాన్ యూనిస్ లోని ప్రజల పరిస్థితి, మానవతా సంక్షోభం మరింత దిగజారే అవకాశం ఉంది. ‘‘మేము ప్రజల్ని వేరే ప్రాంతాలకు వెళ్లాలని కోరాము, వారిలో చాలా మందికి అది సులభం కానది తెలుసు. కానీ ఎదురుకాల్పుల్లో ప్రజలు చిక్కుకోవడం చూడకూడదని అనుకుంటున్నాము’’ అని ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహు సహాయకుడు మార్క్ రెగెవ్ శుక్రవారం అన్నారు.
Read Also: World Cup 2023: ఆనాటి విధ్వంసకర ఇన్నింగ్స్ని గుర్తుచేసుకున్న రికీ పాంటింగ్..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
గాజా స్ట్రిప్లోని 23 లక్షల జనాభాలో సగం మంది ఇప్పటికే వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ముఖ్యంగా హమాస్ కు పట్టు ఉన్న గాజా నగరంలో పాటు ఉత్తరగాజాపై ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. కీలక హమాస్ కమాండర్లను, వారి స్థావరాలను మట్టుబెడుతున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 12 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 5 వేల మంది పిల్లలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే గాజాలోని ఆస్పత్రులను హమాస్ కమాండ్ సెంటర్లుగా, షెల్టర్లుగా, ఆయుధ కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయిల్ బహిర్గతం చేసింది. దీంతో గాజా నగరంలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని టార్గెట్ చేసింది. ఈ ఆస్పత్రి కంప్యూటర్లలో బందీలకు సంబంధించిన ఫుటేజ్ లభించింది. దీంతో పాటు ఆస్పత్రి కింద సొరంగాలను ఇజ్రాయిల్ ఆర్మీ కనుగొంది. యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో అల్ షిఫా ఆస్పత్రిలోని రోగులు బయటకు వెళ్తున్నారు. శనివారం ఇజ్రాయిల్ సైన్యం ఆస్పత్రిని ఖాళీ చేయమని చెప్పిందని ఆస్పత్రి డైరెక్టర్ చెప్పిన నేపథ్యంలో రోగులు కాలినడకన వేరే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే ఇజ్రాయిల్ సైన్యం మాత్రం ఈ ప్రకటనను ఖండించింది.
తాజావార్తలు
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
-
BMW Vision K18: భవిష్యత్ హై-పర్ఫార్మెన్స్ టూరింగ్ బైక్.. బీఎండబ్ల్యూ విజన్ K18 ఆవిష్కరణ
-
Tilak Varma – Sreeleela : శ్రీలీల – తిలక్ వర్మ.. టీ20 లవ్..?
-
iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..