Israel-Hamas War: దక్షిణ గాజాపై ఇజ్రాయిల్ దాడుల్లో 32 మంది మృతి.. అల్ షిఫా నుంచి పారిపోతున్న రోగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇన్నాళ్లు ఉత్తర గాజా ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ, ఇప్పుడు హమాస్ని పూర్తిగా నిర్మూలించడానికి దక్షిణ గాజాపై కూడా ఫోకస్ చేసింది. దక్షిణ గాజా లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళం దాడులు చేసింది. శనివారం జరిగిన ఈ దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గతంలో ఉత్తరగాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ గాజా ప్రజలను హెచ్చరించింది. లక్షలాది మంది ప్రాణాలు చేత పట్టుకుని దక్షిణ ప్రాంతానికి వెళ్లారు. అయితే ఇప్పడు దక్షిణ గాజాపై కూడా దాడులు మొదలయ్యాయి. 4 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఖాన్ యూనిస్ లోని ప్రజల పరిస్థితి, మానవతా సంక్షోభం మరింత దిగజారే అవకాశం ఉంది. ‘‘మేము ప్రజల్ని వేరే ప్రాంతాలకు వెళ్లాలని కోరాము, వారిలో చాలా మందికి అది సులభం కానది తెలుసు. కానీ ఎదురుకాల్పుల్లో ప్రజలు చిక్కుకోవడం చూడకూడదని అనుకుంటున్నాము’’ అని ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహు సహాయకుడు మార్క్ రెగెవ్ శుక్రవారం అన్నారు.
Read Also: World Cup 2023: ఆనాటి విధ్వంసకర ఇన్నింగ్స్ని గుర్తుచేసుకున్న రికీ పాంటింగ్..
Also Read
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
గాజా స్ట్రిప్లోని 23 లక్షల జనాభాలో సగం మంది ఇప్పటికే వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ముఖ్యంగా హమాస్ కు పట్టు ఉన్న గాజా నగరంలో పాటు ఉత్తరగాజాపై ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. కీలక హమాస్ కమాండర్లను, వారి స్థావరాలను మట్టుబెడుతున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 12 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 5 వేల మంది పిల్లలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే గాజాలోని ఆస్పత్రులను హమాస్ కమాండ్ సెంటర్లుగా, షెల్టర్లుగా, ఆయుధ కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయిల్ బహిర్గతం చేసింది. దీంతో గాజా నగరంలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని టార్గెట్ చేసింది. ఈ ఆస్పత్రి కంప్యూటర్లలో బందీలకు సంబంధించిన ఫుటేజ్ లభించింది. దీంతో పాటు ఆస్పత్రి కింద సొరంగాలను ఇజ్రాయిల్ ఆర్మీ కనుగొంది. యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో అల్ షిఫా ఆస్పత్రిలోని రోగులు బయటకు వెళ్తున్నారు. శనివారం ఇజ్రాయిల్ సైన్యం ఆస్పత్రిని ఖాళీ చేయమని చెప్పిందని ఆస్పత్రి డైరెక్టర్ చెప్పిన నేపథ్యంలో రోగులు కాలినడకన వేరే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే ఇజ్రాయిల్ సైన్యం మాత్రం ఈ ప్రకటనను ఖండించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!