Israel-Hamas War: దక్షిణ గాజాపై ఇజ్రాయిల్ దాడుల్లో 32 మంది మృతి.. అల్ షిఫా నుంచి పారిపోతున్న రోగులు..
Israel-Hamas War: ఇన్నాళ్లు ఉత్తర గాజా ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ, ఇప్పుడు హమాస్ని పూర్తిగా నిర్మూలించడానికి దక్షిణ గాజాపై కూడా ఫోకస్ చేసింది. దక్షిణ గాజా లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళం దాడులు చేసింది. శనివారం జరిగిన ఈ దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గతంలో ఉత్తరగాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ గాజా ప్రజలను హెచ్చరించింది. లక్షలాది మంది ప్రాణాలు చేత పట్టుకుని దక్షిణ ప్రాంతానికి వెళ్లారు. అయితే ఇప్పడు దక్షిణ గాజాపై కూడా దాడులు మొదలయ్యాయి. 4 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఖాన్ యూనిస్ లోని ప్రజల పరిస్థితి, మానవతా సంక్షోభం మరింత దిగజారే అవకాశం ఉంది. ‘‘మేము ప్రజల్ని వేరే ప్రాంతాలకు వెళ్లాలని కోరాము, వారిలో చాలా మందికి అది సులభం కానది తెలుసు. కానీ ఎదురుకాల్పుల్లో ప్రజలు చిక్కుకోవడం చూడకూడదని అనుకుంటున్నాము’’ అని ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహు సహాయకుడు మార్క్ రెగెవ్ శుక్రవారం అన్నారు.
Read Also: World Cup 2023: ఆనాటి విధ్వంసకర ఇన్నింగ్స్ని గుర్తుచేసుకున్న రికీ పాంటింగ్..
Also Read
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
గాజా స్ట్రిప్లోని 23 లక్షల జనాభాలో సగం మంది ఇప్పటికే వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ముఖ్యంగా హమాస్ కు పట్టు ఉన్న గాజా నగరంలో పాటు ఉత్తరగాజాపై ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. కీలక హమాస్ కమాండర్లను, వారి స్థావరాలను మట్టుబెడుతున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 12 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 5 వేల మంది పిల్లలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే గాజాలోని ఆస్పత్రులను హమాస్ కమాండ్ సెంటర్లుగా, షెల్టర్లుగా, ఆయుధ కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయిల్ బహిర్గతం చేసింది. దీంతో గాజా నగరంలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని టార్గెట్ చేసింది. ఈ ఆస్పత్రి కంప్యూటర్లలో బందీలకు సంబంధించిన ఫుటేజ్ లభించింది. దీంతో పాటు ఆస్పత్రి కింద సొరంగాలను ఇజ్రాయిల్ ఆర్మీ కనుగొంది. యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో అల్ షిఫా ఆస్పత్రిలోని రోగులు బయటకు వెళ్తున్నారు. శనివారం ఇజ్రాయిల్ సైన్యం ఆస్పత్రిని ఖాళీ చేయమని చెప్పిందని ఆస్పత్రి డైరెక్టర్ చెప్పిన నేపథ్యంలో రోగులు కాలినడకన వేరే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే ఇజ్రాయిల్ సైన్యం మాత్రం ఈ ప్రకటనను ఖండించింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!