Iran – Israel War: నా మాటలను ఇరాన్ పట్టించుకోలేదు.. .. ఇరాన్ దాడులపై ట్రంప్ తొలి రియాక్షన్
- చర్చలపై సంతృప్తిగా లేనని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే దాడులు..
- నా మాటల్ని ఇరాన్ పట్టించుకోవడం లేదంటున్న డొనాల్డ్ ట్రంప్..
Iran Isreal War: ఇరాన్ మీద దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించాడు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుంది అని ఆరోపించాడు. అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు చేపట్టింది.. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదర్కొనేందుకు ఈ దాడులు చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండటం వల్లే ఈ దాడులు చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించాడు.
Read Also: VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇరాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను.. కానీ ఇరాన్కు అణు ఆయుధాలు ఉండకూడదు అనే విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఈ వారం మొత్తం చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. తాను ఇరాన్పై సైనిక చర్యలకు వెళ్లాలని కోరుకోవడం లేదు.. కానీ కొన్ని సందర్భాల్లో అటువంటి పరిస్థితులు తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో భారీగా దాడులు జరిగాయి. ఇజ్రాయెల్- యూఎస్ సంయుక్తంగా కలిసి క్షిపణులతో దాడులు చేశాయి.
Read Also: Hari Teja: బన్నీ కోసం..15 రోజులు అన్నం మానేశా..
మరోవైపు, ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా క్షిపణి దాడులు చేసింది. షీల్డ్ ఆఫ్ జూద్ పేరుతో ఆపరేషన్ చేపట్టగా, 30 ప్రాంతాలను టార్గెట్ చేసింది. నార్త్, ఈస్ట్ టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ తమ పౌరులను హెచ్చరించింది. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే దాడులు చేసినట్లు ప్రకటించింది. అలాగే, ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ ని కూడా మూసివేసినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్- అమెరియా జాయింట్ ఆపరేషన్ తో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!