బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. అనుమానితులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఐతానగర్ కు చెందిన నిందితుడు భరత్ కోసం పోలీసులు గాలించారు. పోలీసులను చూసి చెరువులో దూకి గత ఐదారు గంటలపాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు నిందితుడు భరత్. చెరువులో నుండి బయటకు రాగానే పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. చెరువులో నుంచి పోలీసులకు దొరక్కుండా పారిపోయాడు రౌడీషీటర్ భరత్. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ రౌడీ షీటర్…
లైంగిక వేధింపుల ఘటనలపై మహిళా కమిషన్ ఫోన్ ద్వారా కేసు పూర్వ పరాలను తెలుసుకుని బాధితులకు న్యాయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో వరుస ఘటనలపై పోలీసు అధికారులతో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వారికి పలు సూచనలు చేశారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై సీరియస్ అయ్యారు. పోలీసు అధికారులతో మాట్లాడిన కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. కేసు పూర్వాపరాలు విచారించి…వాలంటీర్…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు ఈ నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ పాలన, వైసీపీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు నేను మూడు సార్లు నిరాహార దీక్ష చేశాను. పార్టీ కార్యాలయంపై వైసీపీ ఉగ్రవాద…
గుంటూరు జీజీహెచ్లో అదృశ్యమైన మూడు రోజుల శిశుశు ఆచూకీ లభ్యమైంది.. బాలుడిని స్వాధీనం చేసుకున్న కొత్తపేట పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించిన నిందితులే.. బాలుడిని అపహరించినట్టు నిర్ధారణకు వచ్చిన కొత్తపేట పోలీసులు.. రంగంలోకి దిగి వారిని ట్రాక్ చేసి పట్టుకున్నారు.. నిందితులు హేమవరుణ్, పద్మలు నెహ్రునగర్ కు చెందిన వారిగా గుర్తించారు.. హేమవరుణ్ గతంలో జీజీహెచ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేశారని చెబుతున్నారు.. ఇక, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన…
గుంటూరు.. జీజీహెచ్లో మూడు రోజుల శిశువు అపహరణకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది… ఈ నెల 12న కాన్పుకోసం పెదకాకానికి చెందిన ప్రియాంక అనే గర్భిణి చేరారు.. 13వ తేదీన మగ శిశువుకు జన్మనించారు.. అయితే, శుక్రవారం రాత్రి పసివాడు ఏడుస్తుండడంతో బయటకు తీసుకెళ్లింది.. ఆ శిశువు నాయనమ్మ… ఇక, బాత్రూంకు వెళ్తూ అక్కడే నిద్రపోతున్న అమ్మమ్మ పార్వతమ్మ పక్కన శిశువును వదిలి వెళ్లింది నాయనమ్మ.. కానీ, ఐదు నిమిషాల్లోనే తిరిగి వచ్చే సరికి శిశువును అపహరణకు…
ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీల మధ్య నలిగిపోతున్నారు అధికారులు. ఏ పని చేస్తే ఎవరు విరుచుకుపడతారో తెలియక ఆందోళన చెందుతున్నారట. ఈ టెన్షన్ అంతా ఒక సర్టిఫికెట్ కోసం. దానిపైనే పెద్ద పొలిటికల్ ఫైటే జరుగుతోంది. రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దుగ్గిరాలలో క్యాస్ట్ సర్టిఫికెట్ రగడ..! కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల పొలిటికల్ పంచాయితీకి ఈ సామెత చక్కగా సరిపోతుంది. దుగ్గిరాల మండల పరిషత్ ఎన్నిక కోసం…
మాజీ ముఖ్యమంత్రి ఇంటి పై దాడి కుట్ర జరిగింది అన్న మాటల్లో వాస్తవం లేదు అని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ అన్నారు. మూడు అంచల భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు పోలీస్ రక్షణ వలయం ఉంది. చంద్ర బాబు ఇంటికి వెల్లడం ఎమ్మెల్యే జోగిరమేష్ చేసిన ప్రయత్నం తొందరపాటు చర్యే… దానిపై చర్యలు ఉంటాయి. కానీ అక్కడ జరిగిన ఘర్షణ మాత్రం సరికాదు. ఎమ్మెల్యే కారు పై చెప్పుల తో రాళ్ల…
క్యాంప్ కార్యాలయంలో సీఎం ఐఎస్ జగన్ను కలిశారు రమ్య కుటుంబ సభ్యులు.. జరిగిన ఘటనపై సీఎం జగన్ను వివరించారు రమ్య తల్లిదండ్రులు జ్యోతి, వెంకటరావు, అక్క మౌనికలు.. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం, ధైర్యాన్ని చెప్పారు.. తాము ఉన్నామంటూ హామీ ఇచ్చారు.. రమ్య కుటుంబ సభ్యులతో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి సుచరిత.. పదిరోజుల్లో ఉద్యోగ నియామకం అయ్యాక సీఎంతో…
గుంటూరు జిల్లాలో ఓ మహిళపై కొంతమంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మేడికొండూరు మండలంలోని పాలడుగులో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి గుంటూరులోని ఓ వివాహానికి హాజరయ్యి బైక్ వస్తున్న భార్య, భర్తలను మేడికొండూరు మండలంలోని అడ్డరోడ్డు వద్ద అడ్డుకున్నారు. భర్తను చితకబాది, మహిళను కత్తులతో బెదిరించి పోలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం అర్థరాత్రి సత్తెనపల్లి పోలీస్స్టేషన్కు చేరుకొని జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. అయితే, సంఘటన జరిగిన ప్రాంతం గుంటూరు అర్బన్…
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారట ఆ మాజీ పోలీస్ అధికారి. ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్న ఆయన… ‘మద్దాలి నిన్నొదల’ అని వెంట పడుతున్నారు. ఎమ్మెల్యేకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారట. ఇద్దరూ ఒకేపార్టీలో.. ఒకే గొడుకు కింద ఉన్నా.. రాజకీయ ఎత్తుగడలు గుంటూరు మిర్చిలా ఘాటెక్కిస్తున్నాయట. వారెవరో? ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం. మద్దాలిని ముప్పుతిప్పలు పెడుతున్న ఏసురత్నం! గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా…