మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలతో గుంటూరు జిల్లా వణుకుతోంది. గుంటూరు జిల్లాలో వరుసగా కొనసాగుతున్న మహిళలపై లైంగిక దాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్16న గురజాల రైల్వేస్టేషన్ లో ఒడిషాకు చెందిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. 27న కొల్లూరు మండలం చిలుమూరులో రూపశ్రీ అనే మహిళను పొలంలోనే హత్య చేశాడు ప్రవీణ్ అనే దుండగుడు. 28న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహిత తిరుపతమ్మ హత్యకు గురయింది. కోరిక తీర్చలేదని గొంతుకు చీర బిగించి హత్య చేశాడు. 29న…
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్రేప్ ఘటన మరువక ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో యువతిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం తుమ్మపూడికి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ బతుకుతోంది. ఆమె భర్త శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతి వెళ్లారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి…
పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైంది కల్యాణ్ జ్యువెలరీ దుకాణంలో పనిచేసే రామాంజనేయులుగా గుర్తించారు. భర్త అపహరణపై నిన్న పోలీసులకు రామాంజనేయులు భార్య ఫిర్యాదు చేశారు. జంగం బాజితో పాటు అన్నవరపు కిషోర్ మరికొందరు షాపులోకి వచ్చి అపహరించారని ఫిర్యాదు చేశారు. రామాంజనేయులు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో చంటి అనే వ్యక్తి అదృశ్యం వెనుక రామాంజనేయులు ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే…
ఆ నియోజకవర్గంలో ఏ నాయకుడికి జెండా పట్టాలో.. ఎవరి సైకిల్ ఎక్కాలో కేడర్కు అర్థం కాని పరిస్థితి. పోటీకి సిద్ధమైన అభ్యర్థులు మాత్రం బస్తీమే సవాల్ అని గ్రూపులు కట్టి కొట్టుకుంటున్నారు. అధిష్ఠానం మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా.. అక్కడి లెక్కలు తేల్చకుండా కాలక్షేపం చేస్తున్నట్టు తమ్ముళ్ల అనుమానం. అసలు ఆ నియోజకవర్గంలో ఎందుకు అంత గందరగోళం? హైకమాండ్ లెక్కలేంటి? వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో తేల్చలేని పరిస్థితి గుంటూరు జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన…
జనం కళ్ళింతలు చేసుకొని అమితాసక్తితో ఎదురుచూస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రన్నింగ్ లో ఉన్న అన్ని థియేటర్లలోనూ ‘ఆర్.ఆర్.ఆర్.’ విడుదలవుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాకు గుండెకాయలాంటి ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రతి ఊరిలో అన్ని సినిమా హాళ్ళలోనూ ‘ట్రిపుల్ ఆర్’ సందడి చేయబోతోంది. తెలుగునాట చాలా రోజులకు విడుదలవుతోన్న అసలు సిసలు మల్టీస్టారర్ గా ‘ట్రిపుల్ ఆర్’ జేజేలు అందుకుంటోంది. అందువల్ల ఆ సినిమాకు ఉన్న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ ఇటీవల రిలీజ్ అయ్యి విజయవంతమైన విషయం తెలిసిందే. భారీగా కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమాపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఇటీవల కాలంలో ప్రతి సినిమాలోనూ కొన్ని సన్నివేశాల వలన కొందరి మనోభావాలను దెబ్బతీశారని కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా భీమ్లా నాయక్ లో కుమ్మరి కులస్థులను అవమానించారని తెలుపుతూ ఏపీ కుమ్మరి శాలివాహన కార్పొరేషన్…
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో గుంటూరు పార్టీ కార్యాలయంలో భేటీ నిర్వహించనున్నారు. ఇవాళ 12 నియోజకవర్గాల ఇన్ఛార్జులతో చంద్రబాబు సమావేశం జరగనుంది. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు 12 మందితో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవనులో సమావేశం జరుగుతుంది. గత రెండు, మూడు రోజులుగా పార్టీ కార్యాలయంలో జిల్లాలవారీగా సమీక్షలు చేస్తూ.. కొత్త ఇంఛార్జ్లను నియమిస్తున్నారు. తాజాగా విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు…
వీరుల త్యాగం తోనే స్వేచ్ఛ అనుభవిస్తున్నాం అన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. గుంటూరులో చారిత్రాత్మకమయిన జిన్నాటవర్ ని బీజేపీ వివాదాస్పదం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. జిన్నా టవర్ కు ప్రత్యేక స్థానం ఉందని, సైనికుల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారన్నారు. వివాదం సృష్టించడం సిగ్గు చేటు.జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన దేశ పాలకులు చిచ్చు పెట్టాలని చూడటం బాధాకరం.జాతీయ స్థాయిలో పాలన చేస్తున్న బిజెపి కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టాలని…
ఈ మధ్య గుంటూరులోని జిన్నా టవర్పై పెద్ద చర్చే సాగుతోంది.. గుంటూరు నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడానికి పాకిస్థాన్ జాతిపిత ఐన మహమ్మద్ అలీ జిన్నా పేరు పెట్టారు.. అయితే, భారతీయ జనతా పార్టీ తరచూ దీనిని లేవనెత్తుతోంది.. రిపబ్లిక్ డే సందర్భంగా జిన్నా టవర్పై జాతీయ జెండా ఎగరేసేందుకు ‘హిందూ వాహిని’ పిలుపునివ్వడం కూడా రచ్చగా మారింది.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిన్నా టవర్పై ప్రభుత్వమే జాతీయ జెండాను ఎగురవేయాలని.. ప్రభుత్వం స్పందించకుంటే హిందూ వాహినితో…
ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను కాపాడి మానవత్వం చాటారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మణిపురం ఫ్లై ఓవర్ పై ఆత్మహత్యాయత్నం చేసింది శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ వివాహిత… స్థానికులు ఎంత సర్దిచెప్పినా వినిపించుకోలేదు ఆమె.. అయితే, ఇంటికి వెళ్తూ సదరు మహిళను గమనించిన ఎమ్మెల్యే ముస్తాఫా.. తన కారు ఆపి.. మహిళకు సర్ది చెప్పారు.. ఆ మహిళ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.. ఇక, కారులో ఎక్కించుకుని సదరు మహిళను తన…