గుంటూరులోని స్వరూపనందేంద్ర సరస్వతి స్వామీ జన్మదినం సందర్భంగా ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు హోంమంత్రి సుచరిత పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. నిబంధనలకు లోబడి అమరావతి రైతులు పాదయాత్ర చేయాలన్నారు. స్వామీ వారి విశిష్ట సేవలు దేశవ్యాప్తంగా అందుతున్నాయన్నారు. వేద పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చదువుతూ సమాజ సేవ చేస్తున్నారన్నారు. స్వామీ వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకుండాలని ఆమె కోరుకున్నారు.
పాదయాత్ర చేస్తూనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిబం ధనల ఉల్లంఘన జరిగితే నోటీసులు ఇస్తామని మంత్రి హెచ్చరిం చారు. పెట్రోలు, డీజీల్ ధరలు గతంలో ఎంత ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి. పెట్రోల్ ధరలు అన్నది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అది రాష్ట్ర పరిధిలో లేదన్నారు. గత ప్రభుత్వంలో ఎంత తగ్గించారో లోకేష్ చెప్పాలని హో మంత్రి డిమాండ్ చేశారు.