2022లో గిర్ సోమనాథ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 32 ఏళ్ల వ్యక్తికి గుజరాత్లోని ప్రత్యేక పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడికి చనిపోయే వరకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ఐ భోరానియా తీర్పు చెప్పారు. దీంతో పాటు నిందితుడికి రూ.25 వేల జరిమానా కూడా విధించారు
Gujarat: గుజరాత్ అహ్మదాబాద్కి చెందిన వ్యక్తికి పెళ్లైన తర్వాత తన భార్య గురించి సంచలన విషయం తెలిసింది. దీంతో తనను మోసం చేశారని సదరు వ్యక్తి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
గుజరాత్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వడోదరలో 13.5 మి.మీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం భారీ వరదలతో ముంచెత్తింది. మరోవైపు.. విశ్వామిత్ర నది ప్రమాదకర స్థాయిని దాటింది. విశ్వామిత్ర నది నీటిమట్టం పెరగడంతో మొసళ్లు బయటకు వస్తున్నాయి. ఎగువ నది నుంచి విడుదలవుతున్న నీటి కారణంగా విశ్వామిత్ర నదికి వరద పోటెత్తింది. నది మట్టం ప్రమాద స్థాయిని దాటి 27.85 అడుగులకు చేరుకుంది.
దేశంలోనే పూర్తి ‘‘శాకాహార’’ నగరంగా గుజరాత్ లోని ‘పాలిటానా’ రికార్డుకెక్కింది. ఈ పట్టణంలో పూర్తిగా మాంసాహారం నిషేధం. ఈ పట్టణం గుజరాత్లోని భావ్ నగర్ జిల్లాలో ఉండి. మాంసం, గుడ్లతో పాటు మాంసాహారం ఈ పట్టణంలో పూర్తిగా నిషేధం
గుజరాత్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు నివాసాలు నీళ్లలో మునిగి ఉన్నాయి. ఇక భారీ వర్షాల కారణంగా మంగళవారం గుజరాత్లోని ద్వారకలోని ఖంభాలియా తాలూకాలో మూడు అంతస్తుల ఇల్లు కూలిపోయింది.
IAS Officer Wife: గుజరాత్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి రణ్జీత్ కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య సూర్య జై తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్స్టర్తో పరిచయం ఏర్పడింది.
Weather update: దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఈ రోజు (మంగళవారం) గుజరాత్, మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరో ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది.
Gujarat : గుజరాత్లో ఓ ఐఏఎస్ అధికారి భార్య విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి గుమ్మం వద్దే విషం తాగి భార్య మృతి చెందినట్లు సమాచారం. కొంతకాలం క్రితం ఆమె ఒక గ్యాంగ్స్టర్తో పారిపోయింది.
Fire Accident : గోవా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ కార్గో షిప్లో పెను ప్రమాదం సంభవించింది. కార్గో షిప్లో భారీ మంటలు చెలరేగాయి. ఈ నౌక గుజరాత్లోని ముంద్రా నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతోంది.
Domestic violence: గుజరాత్లో ఓ భర్త తన భార్యను దారుణంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తపై బాధిత మహిళ గృహహింస కేసు పెట్టింది. తన భర్త అతని స్నేహితుల ముందు బట్టలు విప్పాలని బలవంతం చేస్తున్నట్లు ఆరోపించింది. 35 ఏళ్ల బాధిత మహిళ తాను ఎదుర్కొంటున్న హింస గురించి ఫిర్యాదు చేసింది.