Heavy Rain: వడోదరలో దంచికొట్టిన వర్షం.. రోడ్ల మీదకొస్తున్న మొసళ్లు
- గుజరాత్లో దంచికొడుతున్న వర్షాలు
- వడోదరలో 13.5 మి.మీ వర్షపాతం నమోదు
- ప్రమాదకర స్థాయిని దాటిన విశ్వామిత్ర నది
- నది నీటిమట్టం పెరగడంతో బయటకు వస్తున్న మొసళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వడోదరలో 13.5 మి.మీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం భారీ వరదలతో ముంచెత్తింది. మరోవైపు.. విశ్వామిత్ర నది ప్రమాదకర స్థాయిని దాటింది. విశ్వామిత్ర నది నీటిమట్టం పెరగడంతో మొసళ్లు బయటకు వస్తున్నాయి. ఎగువ నది నుంచి విడుదలవుతున్న నీటి కారణంగా విశ్వామిత్ర నదికి వరద పోటెత్తింది. నది మట్టం ప్రమాద స్థాయిని దాటి 27.85 అడుగులకు చేరుకుంది. దీంతో నగరంలోకి వరద నీరు రావడం మొదలైంది.
Darshan: యాక్టర్ దర్శన్కి కోర్టులో చుక్కెదురు.. అందుకు నో చెప్పిన కోర్టు..
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
భారీ వర్షం కారణంగా వడోదరలో గురువారం పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. మరోవైపు.. జిఐడిసి అగ్నిమాపక కేంద్రం బృందం అకోటా గ్రామంలోని దేవ్నగర్ మురికివాడ నుండి 20 మందిని రక్షించింది. నిజాంపుర ప్రాంతంలోని పటేల్ ఫాడియా, గాంధీ చౌక్లో మొత్తం 50 ఇళ్లు నీట మునిగాయి. ఫతేగంజ్ నరహరి ఆసుపత్రి వెలుపల ఒక మొసలి నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. రాత్రి 2 గంటల సమయంలో మరో మొసలి రోడ్డుపై నడుస్తూ కనిపించింది. మొసలిని చూడగానే ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మొసలిని రక్షించి తిరిగి నదిలోకి వదిలారు.
Sekhar Master: దేవర సాంగ్… ఇప్పుడు కాసేపు హైప్ ఎక్కించుకుందాం!!
వడోదర డివిజన్లోని రైల్వే బ్రిడ్జి కింద నీటిమట్టం పెరగడంతో 11 సుదూర ఎక్స్ప్రెస్ రైళ్ల ఆపరేషన్ను మార్చగా, నాలుగు లోకల్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. గత 24 గంటల్లో గుజరాత్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 8 మంది మరణించారని రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ అలోక్ కుమార్ పాండే తెలిపారు. అదే సమయంలో.. 826 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రభావిత జిల్లాల్లో ఎస్డిఆర్ఎఫ్కు చెందిన 20 బృందాలు, ఎన్డిఆర్ఎఫ్కు చెందిన 11 బృందాలను మోహరించారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!