గుజరాత్లో సౌరాష్ట్ర నుంచి కచ్ వరకు ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. వడోదర నుంచి రాజ్కోట్ వరకు, జామ్నగర్ నుంచి ఖేడా వరకు సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
గుజరాత్ను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు.. చెరువులు ఏకమైపోయాయి. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునిగిపోయాయి. కార్లు, బైకులు, వస్తువులు అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంతగా వరదలు బీభత్సం సృష్టించాయి.
Gujarat Rains: గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతుంది. ఇప్పటికే పలు నగరాల్లో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో దాదాపు 20 మంది ప్రాణాలను విడిచారు.
IMD Alert: దేశవ్యాప్తంగా రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్ష సూచనలు చేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలుగా గుజరాత్లో పది రోజులపాటు ఓ ఆపరేషన్ నిర్వహించారని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్లో భాగంగా వివిధ సైబర్ క్రైమ్లకు పాల్పడిన 36 మందిని అరెస్ట్ చేశారని.. ఆ నిందితులు దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు.
గుజరాత్లో రెండు కుక్కలు, రెండు సింహాల మధ్య సూపర్ ఫైటింగ్ జరిగింది. ఇరువైపుల నుంచి పోరు తీవ్రంగానే జరిగింది. కానీ ఎలాంటి హానీ లేకుండానే ఫైటింగ్ ముగిసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Electricity bill: ఇటీవల కరెంట్ బిల్లుల్లో తప్పులు దొర్లుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇలా సాధారణ కుటుంబాలకు లక్షల్లో కరెంట్ బిల్లులు వచ్చిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా గుజరాత్కి చెందిన ఓ కుటుంబానికి ఏకంగా రూ. 20 లక్షల కరెంట్ బిల్లు రావడం చూసి ఆ ఫ్యామిలీ షాక్ అయింది.
2022లో గిర్ సోమనాథ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 32 ఏళ్ల వ్యక్తికి గుజరాత్లోని ప్రత్యేక పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడికి చనిపోయే వరకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ఐ భోరానియా తీర్పు చెప్పారు. దీంతో పాటు నిందితుడికి రూ.25 వేల జరిమానా కూడా విధించారు
Gujarat: గుజరాత్ అహ్మదాబాద్కి చెందిన వ్యక్తికి పెళ్లైన తర్వాత తన భార్య గురించి సంచలన విషయం తెలిసింది. దీంతో తనను మోసం చేశారని సదరు వ్యక్తి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
గుజరాత్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వడోదరలో 13.5 మి.మీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం భారీ వరదలతో ముంచెత్తింది. మరోవైపు.. విశ్వామిత్ర నది ప్రమాదకర స్థాయిని దాటింది. విశ్వామిత్ర నది నీటిమట్టం పెరగడంతో మొసళ్లు బయటకు వస్తున్నాయి. ఎగువ నది నుంచి విడుదలవుతున్న నీటి కారణంగా విశ్వామిత్ర నదికి వరద పోటెత్తింది. నది మట్టం ప్రమాద స్థాయిని దాటి 27.85 అడుగులకు చేరుకుంది.