CM Chandrababu Gujarat Tour: నేడు గుజరాత్కు సీఎం చంద్రబాబు.. ప్రధానితో భేటీ..!
- నేడు గుజరాత్ కు ఏపీ సీఎం చంద్రబాబు..
- గాంధీ నగర్లో పర్యటించనున్న ఏపీ సీఎం..
- గాంధీనగర్ లో నేటి నుంచి రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024..
- ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Gujarat Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుజరాత్ వెళ్లనున్నారు.. గుజరాత్లోని గాంధీ నగర్లో పర్యటించనున్నారు చంద్రబాబు.. గాంధీనగర్ లో నేటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం.. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎనర్జీ రంగంలో పేరున్న పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులతో చర్చల్లో పాల్గొననున్నారు.. గుజరాత్ పర్యటన కోసం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు చంద్రబాబు.. గాంధీనగర్ ఇన్వెస్టర్స్ మీట్ కు వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అనంతరం రాత్రి 9 గంటలకు అమరావతికి తిరిగి ప్రయాణం కానున్నారు..
Read Also: Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..
Also Read
కాగా, నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు రెన్యూవబుల్ ఎనర్జీ(ఆర్ఈ) ఇన్వెస్టర్స్ మీట్-2024 జరగనుంది.. అయితే.. పునరుత్పాదక విద్యుత్తు రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ఈ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సదస్సు వేదికగా.. జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.. మరోవైపై.. ఆర్ఈ ఇన్వె్స్ట్-2024కు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. దీంతో.. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?