ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే జగనన్న విద్యాదీవెన కిట్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవుల్లోనే విద్యాదీవెన కిట్లను స్కూళ్లకు చేర్చాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. అందుకు అవసరమైన టెండర్ల ఖరారు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి సంబంధిత ఏజెన్సీలతో సకాలంలో ఒప్పందాలు పూర్తిచేసుకుని వర్క్ ఆర్డర్లను జారీ చేయాలని సూచించారు. Read Also:…
తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు టీఎస్ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులందరూ శాశ్వతంగా ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతుందని బాజిరెడ్డి ఆకాంక్షించారు. Read Also: న్యూఇయర్ స్పెషల్: నిమిషానికి…
దేశంలోని బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. డిసెంబర్ 31తో ముగియనున్న కేవైసీ అప్డేట్ గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. కెవైసీ ప్రక్రియలో భాగంగా ఖాతాదారులు బ్యాంకులకు తమ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. Read Also: కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న బంగారం ధర మనీ…
సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అర్హులుగా ఉండి ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి జగన్ సర్కారు తీపికబురు అందించింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది అకౌంట్లలో సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. Read Also: రాజమండ్రికి కేంద్రం న్యూ ఇయర్ కానుక.. ఓఆర్ఆర్ మంజూరు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి…
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో భారీ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. తాజాగా మరో జాబ్ మేళా ప్రకటనను APSSDC విడుదల చేసింది. కృష్ణా జిల్లా నందిగామలో ఈనెల 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ జాబ్ మేళాలో వరుణ్ మోటార్స్, మీషూ, కెస్ కార్పొరేషన్ లిమిటెడ్, డీమార్ట్ వంటి సంస్థలు నియామకాలు చేపట్టనున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 27న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు…
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఎల్లుండి ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. జనవరి మాసానికి సంబంధించి రోజుకు 10వేల చొప్పున టోకెన్లను ఈనెల 27న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే వైకుంఠ ఏకాదశి వేడుకలు ఉన్న సందర్భంగా జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల టోకెన్లను మాత్రమే అందుబాటులో ఉంచుతామని టీటీడీ పేర్కొంది. Read Also: నాసా ప్రయోగం సక్సెస్……
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న దేశ వ్యాప్తంగా పదో విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద కేంద్రం ప్రతి ఏడాది రైతుల అకౌంట్లలో మూడు విడతలుగా రూ.6 వేలు జమ చేస్తోంది. దీని వల్ల దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. జనవరి 1, 2022న మధ్యాహ్నం 12 గంటలకు…
కరోనా పుణ్యమా అని వరుసగా మూడో ఏడాది కూడా ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని రిపోర్టులు అందుతున్నాయి. ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆఫీసులు ఓపెన్ చేయనున్నట్లు ఐటీ ఉద్యోగులకు సమాచారం అందాయి. కానీ ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దీంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు తీసుకొచ్చే విషయంపై పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీలు అధికారికంగా…
సాధారణంగా పెద్ద షాపింగ్ మాళ్లకు వెళ్లే కస్టమర్లకు క్యారీబ్యాగ్స్ విషయంలో సమస్య ఎదురవుతుంది. క్యారీబ్యాగ్ తీసుకువెళ్లకపోతే అదనంగా 5-10 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. వేలకు వేలు పెట్టి సరుకులు, వస్తువులు కొనేటప్పుడు క్యారీబ్యాగ్ ఉచితంగా ఇవ్వమని కస్టమర్లు అడిగితే షాపింగ్ మాల్ నిర్వాహకులు ససేమిరా అంటారు. ఈ విషయంపై హైదరాబాద్ తార్నాకకు చెందిన ఆకాశ్కుమార్ వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశాడు. Read Also: సామాన్యులకు గుడ్న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు వివరాల్లోకి వెళ్తే… 2019 మే 11న…
దేశంలో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. శుద్ధి చేసిన పామాయిల్పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సీబీసీఐసీ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో పామాయిల్ ధరలు తగ్గనున్నాయి. ట్రేడర్లు లైసెన్స్ లేకుండానే పామాయిల్ దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో ఆర్బీడీ పామ్ ఆయిల్, ఆర్బీడీ పామోలిన్ వంటి వాటిని లైనెన్స్ లేకుండానే దిగుమతి చేసుకోవచ్చని తెలిపింది. Read…