ఈ వారం ప్రారంభంలో రుతుపవనాలు వచ్చినందున ఢిల్లీ-ఎన్సిఆర్లో గురువారం వర్షం, మేఘావృతమైన ఆకాశం కనిపించింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 23.5 డిగ్రీల సెల్సియస్ కాగా.. గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది.
S Jaishankar: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశాల్లో భాగంగా ఈ రోజు గోవా వేదికగా ఎస్సిఓ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (సిఎఫ్ఎం) జరిగింది. ఈ సమావేశానికి సభ్యదేశాలు అయిన పాకిస్తాన్, చైనా, రష్యా, తజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ దేశాల విదేశాంగమంత్రలు హాజరయ్యారు. పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా సమావేశాలకు హాజరయ్యారు. బిలావల్ ను స్వాగతించిన కొద్ది సేపటికే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉగ్రవాదంపై స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.
SCO Meeting: షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. మే 4-5 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను పరిశీలించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం గోవాలకు చేరుకున్నారు. ఎస్సీఓ సభ్యదేశాల్లో ఒకటైన పాకిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
TMC: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ లూయిజిన్హో ఫలేరో తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. టీఎంసీ తన జాతీయ పార్టీ హోదాను కోల్పోయినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించిన మరుసటి రోజే ఈ పరిణామం సంభవించింది.
Baba Ramdev: కోవిడ్-19 మహమ్మారి తర్వాత దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరిగిందని ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ శనివారం అన్నరు. గోవాలోని మిరామార్ బీచ్ లో పతంజలి యోగ్ సమితి పేరుతో మూడురోజుల పాటు యోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు. కోవిడ్ తర్వాత క్యాన్సర్ చాలా పెరిగిందని.. ప్రజలు కంటి చూపును, వినికిడి శక్తిని…
గోవా వెళ్లాలని అనుకుంటున్నారా?.. ఇంతకు ముందులాగా అనుమతి లేకుండా పర్యాటకులతో సెల్ఫీలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే.. గోవా సర్కారు కొన్ని ఆదేశాలు జారీ చేసింది.
India-Pakistan: గోవాలో జరగబోయే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను భారత్ ఆహ్వానించనుంది. అంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు కూడా భారత్ ఆహ్వానం పలికింది. వీరిద్దరిలో ఎవరు హాజరైనా.. 2011 తర్వాత భారత్ ను సందర్శించిన పాక్ ప్రతినిధులుగా చరిత్రకెక్కుతారు. వీరితో పాటు చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గ్యాంగ్ కు కూడా భారత్ ఆహ్వానం పలికింది. అయితే వీరిద్దరు సమావేశానికి హాజరావుతారా..? లేదా..?…
Fake Call : విమానాలు, రైళ్లకు ఫేక్ బెదిరింపు కాల్స్ రావడం మళ్లీ ఎక్కువైపోయింది. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బెదిరింపు కాల్ వచ్చింది. రైల్లోని వ్యక్తే బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేయడంతో.. అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి బాంబులేదని తేల్చడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.