S Jaishankar: అది జైశంకర్ అంటే.. పాకిస్తాన్ మంత్రి ముందే ఉగ్రవాదంపై స్ట్రాంగ్ మెసేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశాల్లో భాగంగా ఈ రోజు గోవా వేదికగా ఎస్సిఓ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (సిఎఫ్ఎం) జరిగింది. ఈ సమావేశానికి సభ్యదేశాలు అయిన పాకిస్తాన్, చైనా, రష్యా, తజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ దేశాల విదేశాంగమంత్రలు హాజరయ్యారు. పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా సమావేశాలకు హాజరయ్యారు. బిలావల్ ను స్వాగతించిన కొద్ది సేపటికే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉగ్రవాదంపై స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.
Read Also: DK Shivakumar: శివకుమార్ నీకే ఎందుకిలా..? “భజరంగబలి”కి కోపం వచ్చిందా..?
Also Read
ప్రపంచం కోవిడ్, దాని పర్యవసనాలను ఎదుర్కోవడంలో నిమగ్నమై ఉందని, మరో వైపు ఉగ్రవాద ముప్పు నిరాటంకంగా కొనసాగుతుందని జైశంకర్ అన్నారు. ఉగ్రవాదం దేశాల భద్రతాప్రయోజనాలకు హాని కలిగిస్తోందని అన్నారు. ఉగ్రవాదానికి ఎలాంటి సపోర్ట్ ఉండవద్దని సభ్యదేశాలను ఉద్దేశిస్తూ..ముఖ్యంగా భారత్ లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్, దానికి వంతపాడుతున్న చైనాలను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి ఆర్థిక సహాయాన్ని నిలిపేయాలని పిలుపునిచ్చారు. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు మా దృష్టిలో ఉన్నాయని జైశంకర్ పేర్కొన్నాడు, ఆఫ్ఘన్ ప్రజల సంక్షేమం వైపు మళ్లించాలని అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి, రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ప్రపంచంలో సప్లై చైన్ దెబ్బతిన్నదని, ఇంధనం, ఆహారం, ఎరువులపై తీవ్ర ప్రభావం పడిందని జైశంకర్ అన్నారు. ఈ సవాళ్లను ఎస్సిఓ సభ్యదేశాలు సమిష్టిగా పరిష్కరించడానికి ఒక అవకాశం ఏర్పడిందని అన్నారు. ప్రపంచ జనాభాలో 40 శాతానికి పైగా ఎస్ సీ ఓ సభ్యదేశాల్లోనే ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు.
తాజావార్తలు
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!