Baba Ramdev: కోవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో క్యాన్సర్ కేసులు పెరిగాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Ramdev: కోవిడ్-19 మహమ్మారి తర్వాత దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరిగిందని ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ శనివారం అన్నరు. గోవాలోని మిరామార్ బీచ్ లో పతంజలి యోగ్ సమితి పేరుతో మూడురోజుల పాటు యోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు. కోవిడ్ తర్వాత క్యాన్సర్ చాలా పెరిగిందని.. ప్రజలు కంటి చూపును, వినికిడి శక్తిని కోల్పోతున్నారని అన్నారు.
Read Also: NIA Raids: పీఎఫ్ఐ టార్గెట్గా రాజస్థాన్లో ఎన్ఐఏ సోదాలు..
Also Read
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
భారతదేశం గ్లోబల్ సెంటర్ ఆఫ్ వెల్నెస్గా ఉండాలన్నది మన ప్రధాని నరేంద్ర మోదీ కల అని, గోవా వెల్నెస్ కేంద్రంగా ఉండాలనేది నా కల అని రామ్ దేవ్ అన్నారు. పర్యాటకులు గోవాను సందర్శించడం కోసం మాత్రమే కాకుండా, రక్తపోటు, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, ఇతర వ్యాధులకు చికిత్స పొందాలని అన్నారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికతకు గోవా పర్యాటక కేంద్రంగా మారాలని ఆయన చెప్పారు.
గోవాలో పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉన్న రెండు నెలల్లో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించగలమని.. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారని తెలిపారు. ఆయుర్వేదంలోని పంచకర్మను తమ సంస్థల్లో ప్రవేశపెట్టాలని, తమతో ఉండే పర్యాటకులకు యోగాను పరిచయం చేయాలని ఆయన హోటల్ పరిశ్రమను కోరారు. గోవా తిని, తాగేందుకు మాత్రమే ఉండకూడదని.. జీవితం అంటే తినడం, తాగడం, చనిపోవడం మాత్రమే కానది అన్నారు. యోగా, నేచురోపతి రంగాల్లో రామ్దేవ్ ఆధ్వర్యంలో బృందం చేస్తున్న పరిశోధనలను గోవా సీఎం ప్రమోద్ సావంత్ కొనియాడారు. గోవాను యోగభూమిగా మార్చేందుకు రాష్ట్రప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!