India-Pakistan: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను ఎస్సీఓ సమ్మిట్కు ఆహ్వానించనున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan: గోవాలో జరగబోయే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను భారత్ ఆహ్వానించనుంది. అంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు కూడా భారత్ ఆహ్వానం పలికింది. వీరిద్దరిలో ఎవరు హాజరైనా.. 2011 తర్వాత భారత్ ను సందర్శించిన పాక్ ప్రతినిధులుగా చరిత్రకెక్కుతారు. వీరితో పాటు చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గ్యాంగ్ కు కూడా భారత్ ఆహ్వానం పలికింది. అయితే వీరిద్దరు సమావేశానికి హాజరావుతారా..? లేదా..? అనేది ధృవీకరించలేదు. పాక్ తరుపున 2011లో అప్పటి విదేశాంగ మంత్రి హీనా రాబ్బానీ ఖర్ భారత్ తో పర్యటించారు.
Read Also: Revanth Reddy: గవర్నర్, సీఎంల మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక చూసుకోవాలి.. ఇది సరైన పద్దతి కాదు..
Also Read
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
- Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ
ఈ ఏడాది ఎస్సీఓ అధ్యక్ష బాధ్యతలను భారత్ తీసుకుంది. భారత్ తో పాటు చైనా, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఎస్సిఓ విదేశాంగ మంత్రుల సమావేశం మే మొదటివారంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులకు ఆహ్వానాలను అందిస్తోంది.
2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్ లోని బాలకోట్ జైషేమహ్మద్ స్థావరాలపై భారత్ యుద్ధవిమానాలతో దాడి చేసింది. పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఈ దాడి జరిగింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి, ఆర్టికల్ 370,35ఏని తొలగించడంతో రెండు దేశాల మధ్య అఘాతం మరింత పెరిగింది. అయితే వచ్చే నెలల్లో జరగబోయే ఎస్సిఓ సమావేశాలకు పాకిస్తాన్ హాజరవుతుందో లేదో చూడాలి.
- Tags
- china
- Goa
- india
- Pakistan
- SCO Summit
తాజావార్తలు
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
-
Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
-
VeeraBhadrudu : వీరభద్రుడు వచ్చేశాడు.. ట్రైలర్ లో అదరగొట్టిన సూర్య
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?