SCO Meeting: ఎస్సీఓ సమావేశాలకు గోవా సిద్ధం.. హాజరుకానున్న పాకిస్తాన్ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SCO Meeting: షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. మే 4-5 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను పరిశీలించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం గోవాలకు చేరుకున్నారు. ఎస్సీఓ సభ్యదేశాల్లో ఒకటైన పాకిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. రష్యా, చైనా, కజకిస్తాన్, కర్గిజ్ స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
Read Also: Ukraine War: ఉక్రెయిన్పై రష్యా భీకరదాడులు.. 21 మంది మృతి
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మే 4న ఉదయం గోవా విమానాశ్రయానికి చేరుకుంటారని తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి జైశకంకర్, సెర్గీ లావ్రోవ్ తో భేటీ కానున్నారు. పుతిన్ పై హత్య ప్రయత్నం తర్వాత ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశ వేదికగా రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇరు నేతల సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారు. రష్యాతో పాటు చైనా, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ ద్వైపాక్షిక సమావేశాలు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే దాయాది దేశం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోతో ఎలాంటి భేటీ ఉండదని ఉండదని తెలుస్తోంది.
2022లో సమర్ ఖండ్ లో ఎస్ సీఓ సమావేశాలు జరిగాయి. ఆ తరువాత ఈ ఏడాది అధ్యక్ష బాధ్యతలను భారత్ తీసుకుంది. దీంట్లో భాగంగానే సభ్యదేశాలతో ఇండియా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మేరకు సభ్యదేశాలకు ఇది వరకు భారత్ ఆహ్వానాలు పంపింది. దీంట్లో భాగంగానే పాక్ మంత్రి బిలావల్ భుట్టో భారత్ వస్తున్నారు. 2014 తర్వాత ఓ పాకిస్తాన్ నేత భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే ఈ సమావేశాల్లో కూడా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు పాక్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..