Zimbabwe: ఆఫ్రికా దేశాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయి. కరువు పరిస్థితులతో ఆయా దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా బాటలోనే జింబాబ్వే నడుస్తోంది. అధికంగా ఉన్న ఏనుగుల జనాభాని నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా 200 ఏనుగులను చంపనున్నట్లు ప్రకటించింది. ఏనుగులను చంపాలని జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ అథారిటీ (జిమ్పార్క్స్)ని ప్రభుత్వం ఆదేశించింది.
Gaza : గాజాలో భీకర యుద్ధం కొనసాగుతుంది. దీంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. సోమవారం రఫా సరిహద్దును దాటి గాజాలోకి ప్రవేశించిన సహాయక ట్రక్కులపై ఎగబడ్డ జనం అందినకాడికి సామగ్రిని ఎత్తుకుపోయారు.
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అక్కడ ప్రజలు రోజూ గోధుమ పిండి కోసం పెద్ద యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఆహారం కోసం జరిగిన తొక్కిసలాటల్లో 20 మందికి పైగా ప్రజలు చనిపోయారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. మరోవైపు పాకిస్తాన్ కు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. ఐఎంఎఫ్ 1.1 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తోంది. ఇక మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతోంది. ఆ దేశానికి మిత్రదేశాలతో పాటు ఐఎంఎఫ్ వద్ద అప్పు పుట్టడం లేదు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక వేళ ఎంత ధర పెట్టి కొందాం అని అనుకున్న మార్కెట్లలో సరుకులు లభించడం లేదు. గోధుమ పిండి కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గోధుమ కోసం అక్కడి ప్రజలు ఓ యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే గోధుమ పిండి కేంద్రాల…
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ అల్లాడుతోంది. కనీసం అక్కడి ప్రభుత్వం ప్రజలకు తినేందుకు తిండిని కూడా ఇవ్వలేకపోతోంది. ఎక్కడ చూసిన ఆహారం కోసం తొక్కిసలాటలు, కొట్లాటలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్, పంజాబ్, సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ఇలా అన్ని ప్రాంతాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇతర దేశాల నుంచి వచ్చే తిండి గింజలు ప్రజలకు చేరకముందే రాత్రికి రాత్రి మాయం అవుతున్నాయి.
Pakistan Crisis: పాకిస్తాన్ తో ఆహార సంక్షోభం తీవ్రమవుతోంది. గోధుమ పిండి దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. కొందాం అన్నా కూడా గోధుమ పిండి అందుబాటులో లేకుండా పోయింది. ఉన్నా కూడా కిలోకు వందల్లో ధరలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోధుమ పిండితో లారీలు వెళ్తున్నాయంటే వాటిని వందలాది మంది పాకిస్తాన్ ప్రజలు వెంబడిస్తున్నారు. ట్రక్కుపై ఎక్కుతూ పిండిని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో తెగ వైరల్ అవుతోంది.
Paskistan Economic Crisis: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది దాయాది దేశం పాకిస్తాన్. పతనం అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటిస్తే తప్పా.. పాక్ సంక్షోభం నుంచి బయటపడటం కష్టం. అయితే ఐఎంఎఫ్ షరతులకు పాకిస్తాన్ అంగీకరిస్తేనే అప్పు వస్తుంది. పాకిస్తాన్ 1.1 బిలియన్ డాలర్ల సాయం కోసం ఐఎంఎఫ్ తో చర్చలు జరుపుతోంది. ఇటీవల ఈ షరతుల గురించి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఐఎంఎఫ్ షరతులు ఊహకు అందనివిగా…
Pakistan Crisis: పాకిస్తాన్ లో పరిస్థితులు దిగజారాయి. తినడానికి తిండిలేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. గోధుమ పిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు. పిండికి పెరిగిన రెట్లు, వ్యాపారులు బ్లాక్ చేయడంతో అక్కడ గోధుమ పిండికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్( పీఓకే)లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్సుల నుంచి గోధుమల లోడ్ తో ఏదైనా ట్రక్కు వెళ్తే, బలూచిస్తాన్, పీఓకేకు చేరే అవకాశమే…