UK: సూర్యుడు అస్తమించని అగ్రరాజ్యం.. ఇప్పుడు ఆకలితో అలమటిస్తోంది..
High Inflation In UK: ఒకప్పుడు సూర్యడు అస్తమించన రాజ్యంగా పేరు తెచ్చుకున్న యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. అధిక ద్రవ్యోల్భణం అక్కడి ప్రజలను, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఓ నివేదిక పేర్కొంది. యూకేలోని ప్రతీ ఏడుగురు వ్యక్తుల్లో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని, గతేడాదిగా ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో ఆకలి కేకల్ని ఎదుర్కొంటున్నారని ఫుడ్ బ్యాంక్ స్వచ్ఛంద సంస్థ ట్రస్సెల్ ట్రస్ట్ బుధవారం ప్రచురించిన నివేదిక వెల్లడించింది.
యూకేలో మొత్తం 11.3 మిలియన్ల మంది ఆకలిని ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇది స్కాట్కాండ్ జనాభా కన్నా రెట్టింపు కంటే ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్ ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అయితే గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఓ నివేదిక ప్రకారం యూకే జీడీపీకి సమానంగా ఆ దేశ అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ద్రవ్యోల్భణం, నిత్యావసరాల ధరల కారణంగా ఒక ఏడాదిగా అక్కడి ప్రజలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్భణం దాదాపుగా అందరు కార్మికులు వేతన వృద్ధిని అధిగమించింది.
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
Read Also: Keerthy Suresh: బ్లాక్ కలర్ డ్రెస్సులో హాట్ బాంబ్ లా కీర్తి సురేష్.. ఫొటోలు చూశారా?
యూకేలో ట్రస్సెల్ ట్రస్ట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న 1300 ఫుడ్ బ్యాంక్ సెంటర్లలో మార్చి వరకు రికార్డు స్థాయిలో 3 మిలియన్ ఆహార ప్యాకెట్లను అందించింది. ఇది గతంతో పోలిస్తే 37 శాతం పెరిగింది. ఐదేళ్ల క్రితం గణాంకాలతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. జీవన వ్యయ సంక్షోభం, మహహ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యూకే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. యూకే జనాభాలో 7 శాతం మంది ఆహార బ్యాంకులతో సహా చారిటబుల్ ఫుడ్ సపోర్టు ద్వారా బతుకీడుస్తున్నారు.. ఇంకా 71 శాతం మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది.
ఫుడ్ నెట్వర్క్ ని ఆశ్రయిస్తున్న ఐదుగురిలో ఒకరు పనిచేసే కుటుంబం నుంచి ఉంటున్నారని తెలిపింది. ప్రజలు కష్టపడుతున్నారని మాకు తెలుసని, ఒక్కో ఇంటికి సగటున 3,300 పౌండ్ల విలువైన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్ల ప్రతినిధి చెప్పారు. ప్రభుత్వం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రయోజనాలు మరియు రాష్ట్ర పెన్షన్ను కూడా పెంచింది, కనీస వేతనాన్ని పెంచింది మరియు ఆహారం, శక్తి మరియు ఇతర అవసరమైన ఖర్చులతో కుటుంబాలను ఆదుకుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!