Pakistan Economic Crisis: ప్రజలకు 24 గంటలు గ్యాస్ అందించలేము.. పాక్ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Economic Crisis: పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతోంది. ఆ దేశానికి మిత్రదేశాలతో పాటు ఐఎంఎఫ్ వద్ద అప్పు పుట్టడం లేదు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక వేళ ఎంత ధర పెట్టి కొందాం అని అనుకున్న మార్కెట్లలో సరుకులు లభించడం లేదు. గోధుమ పిండి కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గోధుమ కోసం అక్కడి ప్రజలు ఓ యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే గోధుమ పిండి కేంద్రాల వద్ద ఇటీవల కాలంలో తొక్కిసలాటలు జరిగి 20 మంది మరణించారు.
Read Also: IMF: 2023 ప్రపంచవృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే..
Also Read
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
- China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
- Russia-Ukraine: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
- H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ పెట్రోలియం శాఖ సహాయమంత్రి ముసాదిక్ మాలిక్ మాట్లాడుతూ.. దేశం ప్రభుత్వం ప్రజలకు 24 గంటలు గ్యాస్ సరఫరా చేయలేదని అన్నారు. ప్రజలకు అందించే గ్యాస్ విషయంలో పాక్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతున్న నేపథ్యంలో లోడ్ షెడ్డింగ్ ప్రతీ రోజూ జరుగుతోందని అన్నారు. ప్రజలు ఎదర్కొంటున్న గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించడానికి తాను కరాచీ సందర్శిస్తానని అన్నారు. ధనవంతులు, పేదవారికి గ్యాస్ బిల్లు వేరు చేయబడిందని, ఇప్పుడు ధనవంతులు మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
ప్రధాని షెషబాజ్ షరీఫ్ నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అయ్యేలా చూడాలని అదికారులను ఆదేశించారని, గత వారం గ్యాస్ సరఫరా తగ్గడంతో విద్యుత్ ప్లాంట్లు, పరిశ్రమలకు సరఫరాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ద్రవ్యోల్భణం 50 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్ సాయం కింద 1.1 బిలియన్లను పాక్ ప్రభుత్వం కోరుతోంది. అయితే ఐఎంఎఫ్ అనేక షరతులను పాకిస్తాన్ కు విధించింది. గతిలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ కూడా వాటిని అమలు చేస్తోంది. అయితే ఇన్నీ చేసినా కూడా ఇప్పటి వరకు ఐఎంఎఫ్ ఆర్థిక సాయాన్ని విడుదల చేయలేదు.
తాజావార్తలు
-
TGEAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!