Zimbabwe: జింబాబ్వేలో తీవ్ర ఆహార సంక్షోభం.. 200 ఏనుగుల్ని చంపేందుకు అనుమతి..
- నమీబియా దారిలో జింబాబ్వే నిర్ణయం..
- 200 ఏనుగుల్ని చంపేందుకు ప్రభుత్వం ఆదేశాలు..
- తీవ్ర కరువు.. ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zimbabwe: ఆఫ్రికా దేశాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయి. కరువు పరిస్థితులతో ఆయా దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా బాటలోనే జింబాబ్వే నడుస్తోంది. అధికంగా ఉన్న ఏనుగుల జనాభాని నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా 200 ఏనుగులను చంపనున్నట్లు ప్రకటించింది. ఏనుగులను చంపాలని జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ అథారిటీ (జిమ్పార్క్స్)ని ప్రభుత్వం ఆదేశించింది.
జింబాబ్వేలో ఏనుగులు ఎక్కువగా ఉండే హ్వాంగే నేషనల్ పార్కులోని ఏనుగులను చంపడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో తీవ్ర పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటికే ఈ ఏడాది 160 ఏనుగులు మరణించాయి. మానవ-ఏనుగుల సంఘర్షణలు, ఆహార భద్రతను సమతుల్యం చేయాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతూ జింబాబ్వే పర్యావరణ మంత్రి, సిథెంబిసో న్యోని ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తాము నమీబియా విధానాన్ని తీసుకున్నామని, ఏనుగులను చంపడంతో పాటు వాటి మాంసాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పారు.
Also Read
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
Read Also: Kolkata Doctor Case: వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన మమతా బెనర్జీ.. కోల్కతా టాప్ కాప్ తొలగింపు..
లక్షకు పైగా ఏనుగుల కలిగిన రెండో అతిపెద్ద దేశంగా జింబాబ్వేకి పేరుంది. ఒక్క హ్వాంగే నేషనల్ పార్కులోని 65000 ఏనుగులు ఉన్నాయి. ఇది దాని సామర్థ్యానికి మించిపోయింది. దేశంలో చివరిసారిగా 1988లో ఏనుగులను చంపే ఆపరేషన్ నిర్వహించారు. జింబాబ్వేకి పొరుగున ఉన్న నమీబియాలో కూడా కరువు తీవ్రంగా ఉంది. దీంతో 83 ఏనుగులతో సహా 160 వన్యప్రాణుల్ని చంపేసింది.
దేశ అడవుల్లో సంచరించే 700 అరుదైన అడవి జంతువులను వధించి.. ఆ మాంసం ప్రజలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 83 ఏనుగులు, 30 హిప్పోలు (నీటి గుర్రాలు), 60 అడవి దున్నలు, 50 ఇంపాలాలు, 100 బ్లూ వైల్డ్ బీస్ట్, 300 జీబ్రాలను చంపబోతున్నట్లు ప్రకటించింది. ఆకలితో అలమటిస్తున్న ఆ దేశ ప్రజలకు వీటి మాంసాన్ని పంపిణీ చేస్తామని చెప్పింది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!