సినీ స్టార్స్ కు ఫ్యామిలీతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సినిమాలు, ఫ్యామిలీ రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేస్తారు. సినిమాలకు ఎంత సమయం కేటాయిస్తారో… ఫ్యామిలీకి కూడా అంతే సమయాన్ని కేటాయిస్తారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో టాప్ సెలెబ్రిటీ అయినా కూడా డేట్స్ ను ఎలా మేనేజ్ చేస్తున్నారు ? అనే సందేహం చాలామందికి కలగక మానదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తరచుగా మహేష్…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ చాలా యంగ్ గా కన్పిస్తారు. బాలీవుడ్ హీరోలా కనిపించే మన ప్రిన్స్ ఇప్పటికీ యంగ్ హీరోలందరికీ గట్టి పోటీ ఇస్తారు. ఆయన ఫిట్నెస్ రహస్యం ఏమై ఉంటుందా? అని ఇప్పటికీ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మహేష్ మాత్రం తన సీక్రెట్స్ ను ఎప్పుడూ బయట పెట్టలేదు. కానీ తాజాగా ఈ విషయాలన్నీ బయట పెట్టక తప్పలేదు మహేష్ కు. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ గేమ్ షో…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రం “సర్కారు వారి పాట” షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు మహేష్. “ఎవరు మీలో కోటీశ్వరులు” గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో మహేష్ బాబు హాట్ సీట్ లో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్తో గేమ్ ఆడుతున్నప్పుడు మహేష్ తన తదుపరి చిత్రంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. గేమ్…
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” గేమ్ షో చివరి ఎపిసోడ్ నిన్న ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు అతిథిగా సందడి చేశారు. షోలో మహేష్, ఎన్టీఆర్ మధ్య జరిగిన సరదా సంభాషణ ఆకట్టుకుంది. ఈ వినోదభరితమైన ఎపిసోడ్ లో మహేష్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చాలానే రాబట్టాడు ఎన్టీఆర్. హాట్ సీట్ లో కూర్చున్న మహేష్ బాబు సైతం ఎన్టీఆర్ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పారు. ఈ స్పెషల్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తో “మీలో ఎవరు కోటీశ్వరులు” షోకు అద్భుతమైన ఎండింగ్ ఇచ్చారు మేకర్స్. ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా, ఆ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరైన “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రత్యేక ఎపిసోడ్ను నిన్న సాయంత్రం ప్రసారం చేశారు మేకర్స్. జూనియర్ ఎన్టీఆర్ గేమ్ షో హోస్ట్, మహేష్ అతిథిగా బుల్లితెరపై ప్రేక్షకులకు…
జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిన్న ఈ షోలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా, మహేష్ బాబు అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే ఇది నిన్నటి వార్తే కానీ తాజా అప్డేట్ ఏమిటంటే ఈ సూపర్ ఎపిసోడ్ లో ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు సూపర్ స్టార్స్ కన్పించబోతున్నారట. “ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో ఫ్రెండ్ లైఫ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదు మంచి హోస్ట్ కూడా. ఇప్పటి వరకూ ఆయన చేసిన కొన్ని బుల్లితెర షోలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. గతంలో ‘బిగ్ బాస్’, ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలకు హోస్టుగా కన్పించారు ఎన్టీఆర్. ముందుగా హిందీలో ప్రసారమైన ఈ షోను గతంలోనే తెలుగు బుల్లితెరపై “ఎవరు మీలో కోటీశ్వరులు” పేరుతో ప్రసారం చేయగా నాగార్జున, చిరంజీవి హోస్టులుగా కన్పించారు. వాటికి మంచి స్పందనే వచ్చింది. తాజాగా…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో గేమ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి ప్లాన్ చేస్తున్న మేకర్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత కొరటాల శివ, సమంత ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు హాజరయ్యారు. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం సంగీత స్వరకర్తలు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, యంగ్ సెన్సేషన్ తమన్ ‘ఎవరు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”. ప్రారంభం నుంచీ షోకు పెద్దగా రేటింగ్ రాకపోవడంతో ఈ పండగకు ఎలాగైనా షోకు మంచి రేటింగ్ వచ్చేలా హైప్ పెంచాలని చూస్తున్నారు మేకర్స్. అందుకే ఈ షోకు రాజమౌళి, సమంత, మిల్కీ బ్యూటీ తమన్నా వంటి స్టార్స్ ను స్పెషల్ గెస్టులుగా తీసుకొస్తున్నారు. ఇలాంటి స్టార్స్ షోలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నప్పటి నుంచీ వాళ్ళు గేమ్ ఎలా ఆడతారు ? హోస్ట్…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” షో అలా అలా సాగుతోంది. ఈ షోకు టీఆర్పీని పెంచడానికి నానా తంటాలూ పడుతున్నారు. అయినప్పటికీ యావరేజ్ కి మించి టిఆర్పి రేటింగ్ పెరగడం లేదు. మేకర్స్ ప్రత్యేకంగా షోపై బజ్ ను పెంచడానికి సెలెబ్రిటీలను సైతం ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు రామ్ చరణ్, రాజమౌళి, మహేష్ బాబు, సమంత వంటి స్టార్స్ హాజరయ్యారు. రానున్న పండగల సందర్భంగా ఈ సెలెబ్రిటీల స్పెషల్…