Electricity Bills: విద్యుత్ ఛార్జీల విషయంలో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. విద్యుత్ వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించేలా ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. అయితే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బిల్లుల్లో ఎఫ్పీపీపీ ఛార్జీలు 40 పైసలు అధికంగా వసూలు చేశాయని గుర్తుచేసిన ఆయన.. దీంతో, పేదలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు.. అయితే, కూటమి సర్కార్ విద్యుత్ బిల్లులు తగ్గించేలా చర్యలు తీసుకుంటుంది..…
Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీటెక్కాయి. భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటుంది. తాజాగా తన ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందంటూ అరిచి గోల చేసింది.
KTR: ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
Karnataka: కర్ణాటక ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టేందుకు ససేమిరా అంటున్నారు. కర్ణాటక వ్యాప్తంగా పలు జిల్లాలో ఇదే విధంగా ప్రజలు స్పందిస్తున్నారు. ఇందుకు కారణం కాంగ్రెస్ ఇచ్చిన హామీ. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది.
కరెంట్ చార్జీలు ఎప్పుడు తగ్గిస్తావో చెప్పు కేసీఆర్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మంగళవారం సీఎం కేసీఆర్ యాసంగి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించి కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. కరెండు చార్జీల విషయమై ప్రతి ఇంటికి వెళ్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా సంవత్సరానికి పాతబస్తీ నుండి వేయి కోట్లు రావాలని ఆయన అన్నారు. మతతత్వ వాదివి నువ్వు.. అంటూ కేసీఆర్…