Karnataka: మా కరెంట్ బిల్లులు కాంగ్రెస్ కడుతుంది.. వారి నుంచే తీసుకోవాలి..
Karnataka: కర్ణాటక ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టేందుకు ససేమిరా అంటున్నారు. కర్ణాటక వ్యాప్తంగా పలు జిల్లాలో ఇదే విధంగా ప్రజలు స్పందిస్తున్నారు. ఇందుకు కారణం కాంగ్రెస్ ఇచ్చిన హామీ. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో విద్యుత్ అధికారులు గ్రామాల్లో బిల్లులు వసూలు చేసేందుకు వెళ్లిన సమయంలో తాము బిల్లులు కట్టం అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు.
Read Also: IND vs PAK : టీమిండియా-పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ కు ప్లాన్..?
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
అయితే ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉంది. అయితే పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొప్పల్, కలబురిగి, చిత్రదుర్గ వంటి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో విద్యుత్ అధికారులకు ఇలాంటి సమాధానాలే విద్యుత్ అధికారులకు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మా బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెబుతున్నారు.
విద్యుత్ శాఖ అధికారులు మీటర్ రీడింగ్ చేసేందుకు గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు ఈ విధంగా స్పందిస్తున్నారు. చిత్రదుర్గలో ఓ మహిళకు బిల్లు అందచేయగా.. ఆమె బిల్లు చెల్లించేందుకు నిరాకరించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి ఓటేశానని, అప్పటి నుంచి కాంగ్రెస్ ఇచ్చిన హామీకి అర్హురాలినని చెప్పింది. మా బిల్లులను సిద్దరామయ్య, డీకే శివకుమార్ చెల్లిస్తారని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత నుంచి 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామన్నారు కాబట్టి ఇటువైపు రావద్దని హెచ్చరిస్తున్నారు.
కర్ణాటకలో మొత్తం 1.9 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వీరంతా 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీని వాడుకుంటే నెలకు 3,845 మిలియన్ యూనిట్లు అవుతుంది. ప్రస్తుతం యూనిట్ కు రూ. 8.75 అనుకున్నా.. నెలకు రూ. 3,367 కోట్లు అవుతుంది. అంటే ఏడాదికి ప్రభుత్వ ఖజానాపై రూ. 44,404 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ ఇందులో సగం కుటుంబాలు ఈ హామీ పరిధి కిందకు వచ్చినా.. ఏడాదికి రూ. 20,000 కోట్లు ఖర్చు అవుతుంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!