Kangana Ranaut: మేడం కొంచెం చూసి మాట్లాడండి.. బీజేపీ ఎంపీకి విద్యుత్ శాఖ కౌంటర్
- హిమాచల్ ప్రదేశ్ లో హీటెక్కిన పాలిటిక్స్..
- నా ఇంటికి రూ. లక్ష కరెంట్ బిల్లు వచ్చిందంటూ కంగనా రనౌత్ ఆరోపణలు..
- లక్ష కాదు రూ.91,100 మాత్రమే అని క్లారిటీ ఇచ్చిన విద్యుత్ శాఖ..
- కరెంట్ బిల్లు కట్టకపోవడంతోనే 91 వేలు వచ్చింది: విద్యుత్ శాఖ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీటెక్కాయి. భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటుంది. తాజాగా తన ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందంటూ అరిచి గోల చేసింది. ఇంత మొత్తం బిల్లు రావడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు అని ఆరోపించింది. మనాలీలో ఉన్న మా ఇంటికి ఈ నెల రూ. లక్ష కరెంట్ బిల్లు వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ మధ్యకాలంలో నేను ఆ ఇంట్లో ఉండలేదు.. దీంతో ఆ బిల్లు చూసి ఒక్కసారిగా షాకయ్యాను అని చెప్పుకొచ్చింది. ఈ తోడేళ్ల చెర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కంగనా రనౌత్ విరుచుకుపడింది.
Read Also: Hanmakonda: చెరువులో దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఏంటంటే?
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఇక, రంగంలోని దిగిన విద్యుత్ శాఖ అధికారులు.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇంటికి పంపిన కరెంట్ బిల్లుపై ఆరా తీశారు. ఎంపీ కంగనా ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ HPSEBL మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ రియాక్ట్ అయ్యారు. మండి ఎంపీ ఇంటికి వచ్చిన బిల్లు లక్ష రూపాయలు కాదని రూ.55 వేలు మాత్రమే.. గతంలో చెల్లించని బిల్లుల కారణంగా మొత్తం రూ.91,100 బిల్లు వచ్చిందన్నారు. అంతేకాకుండా 28 రోజుల్లోనే ఎంపీ కంగనా దాదాపు 9 వేల యూనిట్ల విద్యుత్ ను ఉపయోగించింది.. అందుకే ఒక్క నెల బిల్లు రూ.55 వేలు వచ్చిందని అన్ని లెక్కలతో సహా మీడియాకు చూపించారు. అలాగే, తాము బీజేపీ ఎంపీకి రూ.700 సబ్సిడీ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు.
Read Also: Hyderabad: నగరంలో మరో హిట్ అండ్ రన్.. బైకును ఢీ కొట్టిన కారు.. యువతి మృతి
అలాగే, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ.. మేడమ్ కరెంట్ బిల్లులు చెల్లించరు.. అంతటితో ఆగకుండా మా ప్రభుత్వాన్నే నిందిస్తారు అంటూ చురకలు అంటించారు. ప్రజా వేదికలపై అరిచి గోల చేస్తారు.. ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక ఆరోపణలు చేస్తారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు పెద్దవి చూసి బిల్లును చూడండి మేడం కంగనా అంటూ మంత్రి విక్రమాదిత్య పేర్కొన్నారు.
Mandi, Himachal Pradesh: BJP MP Kangana Ranaut says, "In Himachal Pradesh, the Congress has created such a miserable situation. This month, I received an electricity bill of ₹1 lakh for my house in Manali, where I don’t even stay! Just imagine the condition here…" pic.twitter.com/6AAzvTekrt
— IANS (@ians_india) April 8, 2025
#WATCH | Shimla, HP | Sandeep Kumar, Managing Director of the Himachal Pradesh State Electricity Board Limited (HPSEBL), says, "BJP MP Kangana Ranaut raised an issue that the electricity board has asked her to pay the electricity bill of Rs 1 lakh of her house. The bill is almost… pic.twitter.com/oBnZPl9OhU
— ANI (@ANI) April 10, 2025
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!