Kangana Ranaut: మేడం కొంచెం చూసి మాట్లాడండి.. బీజేపీ ఎంపీకి విద్యుత్ శాఖ కౌంటర్
- హిమాచల్ ప్రదేశ్ లో హీటెక్కిన పాలిటిక్స్..
- నా ఇంటికి రూ. లక్ష కరెంట్ బిల్లు వచ్చిందంటూ కంగనా రనౌత్ ఆరోపణలు..
- లక్ష కాదు రూ.91,100 మాత్రమే అని క్లారిటీ ఇచ్చిన విద్యుత్ శాఖ..
- కరెంట్ బిల్లు కట్టకపోవడంతోనే 91 వేలు వచ్చింది: విద్యుత్ శాఖ అధికారులు
Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీటెక్కాయి. భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటుంది. తాజాగా తన ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందంటూ అరిచి గోల చేసింది. ఇంత మొత్తం బిల్లు రావడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు అని ఆరోపించింది. మనాలీలో ఉన్న మా ఇంటికి ఈ నెల రూ. లక్ష కరెంట్ బిల్లు వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ మధ్యకాలంలో నేను ఆ ఇంట్లో ఉండలేదు.. దీంతో ఆ బిల్లు చూసి ఒక్కసారిగా షాకయ్యాను అని చెప్పుకొచ్చింది. ఈ తోడేళ్ల చెర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కంగనా రనౌత్ విరుచుకుపడింది.
Read Also: Hanmakonda: చెరువులో దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఏంటంటే?
Also Read
ఇక, రంగంలోని దిగిన విద్యుత్ శాఖ అధికారులు.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇంటికి పంపిన కరెంట్ బిల్లుపై ఆరా తీశారు. ఎంపీ కంగనా ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ HPSEBL మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ రియాక్ట్ అయ్యారు. మండి ఎంపీ ఇంటికి వచ్చిన బిల్లు లక్ష రూపాయలు కాదని రూ.55 వేలు మాత్రమే.. గతంలో చెల్లించని బిల్లుల కారణంగా మొత్తం రూ.91,100 బిల్లు వచ్చిందన్నారు. అంతేకాకుండా 28 రోజుల్లోనే ఎంపీ కంగనా దాదాపు 9 వేల యూనిట్ల విద్యుత్ ను ఉపయోగించింది.. అందుకే ఒక్క నెల బిల్లు రూ.55 వేలు వచ్చిందని అన్ని లెక్కలతో సహా మీడియాకు చూపించారు. అలాగే, తాము బీజేపీ ఎంపీకి రూ.700 సబ్సిడీ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు.
Read Also: Hyderabad: నగరంలో మరో హిట్ అండ్ రన్.. బైకును ఢీ కొట్టిన కారు.. యువతి మృతి
అలాగే, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ.. మేడమ్ కరెంట్ బిల్లులు చెల్లించరు.. అంతటితో ఆగకుండా మా ప్రభుత్వాన్నే నిందిస్తారు అంటూ చురకలు అంటించారు. ప్రజా వేదికలపై అరిచి గోల చేస్తారు.. ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక ఆరోపణలు చేస్తారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు పెద్దవి చూసి బిల్లును చూడండి మేడం కంగనా అంటూ మంత్రి విక్రమాదిత్య పేర్కొన్నారు.
Mandi, Himachal Pradesh: BJP MP Kangana Ranaut says, "In Himachal Pradesh, the Congress has created such a miserable situation. This month, I received an electricity bill of ₹1 lakh for my house in Manali, where I don’t even stay! Just imagine the condition here…" pic.twitter.com/6AAzvTekrt
— IANS (@ians_india) April 8, 2025
#WATCH | Shimla, HP | Sandeep Kumar, Managing Director of the Himachal Pradesh State Electricity Board Limited (HPSEBL), says, "BJP MP Kangana Ranaut raised an issue that the electricity board has asked her to pay the electricity bill of Rs 1 lakh of her house. The bill is almost… pic.twitter.com/oBnZPl9OhU
— ANI (@ANI) April 10, 2025
తాజావార్తలు
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
-
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
-
Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో