PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముగిసింది. మూడు రోజలు పాటు ఈయన అమెరికాలో బిజీబీజీగా పర్యటించారు. ఈ రోజు ఆయన ఈజిప్టు పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పాటు ఆయన ఈజిప్టులో పర్యటించనున్నారు. 1997 తర్వాత తొలిసారిగా భారత ప్రధాని ఈజిప్టు పర్యటనకు వెళ్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 24 నుంచి ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి ఆహ్వానం మేరకు మోడీ రెండు రోజుల పర్యటన జూన్ 24న ప్రారంభం కానుంది.
Russian tourist eaten by shark: ఈజిప్ట్ లో ఘోరమైన సంఘటన జరిగింది. సరదాగా సముద్రంలో సేదతీరుదాం అనుకున్న వ్యక్తి సొరచేప దాడిలో ప్రాణాలు వదిలాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి చివరి క్షణం వరకు బాధితుడు ప్రయత్నించినా షార్క్ నుంచి తప్పించుకోలేకపోయాడు.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ ద్వారా లీక్ అయిన యూఎస్ ఇంటెలిజెన్స్ పత్రాల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు మిత్రదేశంగా ఉన్న ఈజిప్టు, రష్యాకు సాయం చేసేందుకు సిద్ధం అయినట్లు పత్రాల ద్వారా వెల్లడైంది. ఈజిప్టు రహస్యంగా దాదాపుగా 40,000 రాకెట్లను ఉత్పత్తి చేసి రష్యాకు సరఫరా చేయాలని ప్లాన్ వేసింది.
చేతులు లేకుండా ఈత కొట్టడం అనేది అత్యంత ప్రావీణ్యం ఉన్న ఈతగాళ్ళు కూడా ఊహించలేరు. చేతికి సంకేళ్లు ధరించిఈది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సొంత చేసుకోవడం అంత సులువు కూడా కాదు. కానీ, ఈజిప్టుకు చెందిన ఓ ఈతగాడు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు 2,000 లకు పైగా మమ్మీ చేయబడిన గొర్రె తలలను ఫారో రామ్సెస్ II ఆలయంలో ప్రసాదంగా ఉంచినట్లు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
అర్జెంటీనా, ఈజిప్ట్లు భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA) తేజస్ను కొనుగోలు చేయడంలో ఆసక్తిని కనబరచడంలో అనేక ఇతర దేశాలలో చేరాయి.
Roman City : ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు 1,800 సంవత్సరాల పురాతన రోమన్ నగరాన్ని కనుగొన్నారు. ఈజిప్టులోని లక్సోర్ నగరం ఈ ఆవిష్కరణకు వేదికైంది. ఈ నగరం రెండు లేదా మూడవ శతాబ్దానికి చెందినది ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు.