ఈజిప్టు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. గాజా శాంతి శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్-మాక్రాన్ మధ్య ‘ఆర్మ్ రెజ్లింగ్’ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రధాని మోడీని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. అది కూడా ప్రపంచ అగ్ర నాయకులంతా ఒక చోట నిలబడి ఉండగా.. అంతేకాకుండా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పక్కనే ఉండగా ఈ సంఘటన జరగడం విశేషం. ఈజిప్టులో గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది.
ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. సోమవారం షర్మ్ ఎల్ షేక్లో అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సీసీ ఆధ్వర్యంలో శాంతి శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు.
ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన తొలి రౌండ్ పరోక్ష చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్లుగా తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు.
Arab-Islamic Nato: అమెరికా నేతృత్వంలోని ‘‘నాటో’’ తరహా సైనిక కూటమికి అరబ్-ఇస్లామిక్ దేశాలు సిద్ధమవుతున్నాయా..? అంటే, ఇందుకు కొన్ని దేశాలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, పాకిస్తాన్, దాని మిత్ర దేశం టర్కీలు ‘‘ అరబ్-ఇస్లామిక్’’ సైనిక కూటమి కోసం తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవల, ఖతార్పై హమాస్ అగ్రనాయకత్వమే లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో, ఇజ్రాయిల్ను అడ్డుకోవడానికి నాటో తరహా కూటమి కట్టాలని ఇస్లామిక్, అరబ్ దేశాలు భావిస్తున్నాయి.
టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్ దేశాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.2గా నమోదైంది. టర్కీ, ఈజిప్ట్, సిరియా అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హమాస్-లెబనాన్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది.
Israel–Hamas war: ఈజిప్టు రాజధాని కైరోలో ఈ రోజు (నవంబర్30) ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై నిర్వహించే చర్చలకు తమ ప్రతినిధులు హాజరవుతారని హమాస్ గ్రూప్ తెలిపింది.
ఈజిప్ట్ పిరమిడ్లు.. మమ్మీలకు ప్రసిద్ధి చెందింది. అయితే వాటి వెనుక చాలా కథలు ఉన్నాయి. మతపరమైన ఆచారాల ప్రకారం కొన్ని జంతువులను కూడా బలి ఇచ్చారని ఓ అధ్యయనం గుర్తించింది.
ఒలింపిక్స్ పాల్గొంటే చాలని క్రీడాకారులంతా కలలు కంటూ ఉంటారు. పతకం గెలవకపోయినా ఈ క్రీడల్లో పాల్గొంటే చాలని అహర్నశలు కష్టపడుతుంటారు. అయితే ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హఫీజ్ మాత్రం మరో అడుగు ముందు కేసింది. ఏడు నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగింది. ఈజిప్ట్కి చెందిన ఫెన్సర్ నాడా హఫీజ్(26), 7 నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్లో పోటీ పడింది..