Egypt Temple: ఈజిప్ట్ ఆలయంలో వింత.. 2వేలకు పైగా గొర్రెతలలు లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Egypt Temple: ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు 2,000 లకు పైగా మమ్మీ చేయబడిన గొర్రె తలలను కనుగొన్నారు. ఆ గొర్రె తలలను ఫారో రామ్సెస్ II ఆలయంలో ప్రసాదంగా ఉంచినట్లు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిసల మమ్మీలను కూడా న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి వెళ్లిన యూఎస్ పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం అబిడోస్ వద్ద వెలికితీసింది. ఇది దక్షిణ ఈజిప్టులోని దేవాలయాలు, సమాధులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం.
అమెరికన్ మిషన్ అధిపతి సమేహ్ ఇస్కందర్ మాట్లాడుతూ.. రామ్సేస్ II మరణించిన 1,000 సంవత్సరాల తర్వాత జరుపుకునే ఆరాధనను సూచిస్తూ రామ తలలు “అర్పణలు” అని చెప్పారు. క్రీ.పూ 1304 నుంచి 1237 వరకు దాదాపు ఏడు దశాబ్దాల పాటు రామ్సెస్ II ఈజిప్టును పాలించాడు. ఈ ఆవిష్కరణలు 2374-2140 బీసీ మధ్య, టోలెమిక్ కాలం 323 నుంచి 30 బీసీ వరకు రామ్సెస్ II ఆలయం గురించి, అక్కడ జరిగిన కార్యకలాపాల గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడతాయని ఈజిప్ట్లోని పురాతన వస్తువుల సుప్రీం కౌన్సిల్ అధిపతి మోస్తఫా వాజిరి చెప్పారు. అలాగే మమ్మీ చేయబడిన జంతువుల అవశేషాలతో పాటు దాదాపు 4,000 సంవత్సరాల క్రితం నాటి ఐదు మీటర్ల మందం (16 అడుగుల) గోడలతో కూడిన ప్యాలెస్ అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు అనేక విగ్రహాలు, పాపిరి, పురాతన చెట్ల అవశేషాలు, తోలు బట్టలు, బూట్లు కూడా కనుగొన్నారు. కైరోకు దక్షిణంగా ఉన్న అబిడోస్ ఆలయాలకు ప్రసిద్ధి చెందింది.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Read Also: Atiq Ahmed: ప్రయాగ్రాజ్ జైలులోని హైసెక్యూరిటీ బ్యారక్కు అతిక్ అహ్మద్!
ఈజిప్టు క్రమం తప్పకుండా కొత్త పురావస్తు ఆవిష్కరణలను ప్రకటిస్తుంది. ఇది వారి శాస్త్రీయ లేదా చారిత్రాత్మక ప్రాముఖ్యత కంటే రాజకీయ, ఆర్థిక ప్రభావం కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 105 మిలియన్ల మందికి నివాసంగా ఉన్న ఈజిప్ట్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆ దేశం ఎక్కువగా పర్యాటకంపై ఆధారపడింది. పర్యాటకమే రెండు మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారికి ముందు 13 మిలియన్లతో పోలిస్తే, 2028 నాటికి సంవత్సరానికి 30 మిలియన్ల మంది సందర్శకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పర్యాటకాన్ని పునరుద్ధరించాలని కైరో భావిస్తోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!