Egypt Temple: ఈజిప్ట్ ఆలయంలో వింత.. 2వేలకు పైగా గొర్రెతలలు లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Egypt Temple: ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు 2,000 లకు పైగా మమ్మీ చేయబడిన గొర్రె తలలను కనుగొన్నారు. ఆ గొర్రె తలలను ఫారో రామ్సెస్ II ఆలయంలో ప్రసాదంగా ఉంచినట్లు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిసల మమ్మీలను కూడా న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి వెళ్లిన యూఎస్ పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం అబిడోస్ వద్ద వెలికితీసింది. ఇది దక్షిణ ఈజిప్టులోని దేవాలయాలు, సమాధులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం.
అమెరికన్ మిషన్ అధిపతి సమేహ్ ఇస్కందర్ మాట్లాడుతూ.. రామ్సేస్ II మరణించిన 1,000 సంవత్సరాల తర్వాత జరుపుకునే ఆరాధనను సూచిస్తూ రామ తలలు “అర్పణలు” అని చెప్పారు. క్రీ.పూ 1304 నుంచి 1237 వరకు దాదాపు ఏడు దశాబ్దాల పాటు రామ్సెస్ II ఈజిప్టును పాలించాడు. ఈ ఆవిష్కరణలు 2374-2140 బీసీ మధ్య, టోలెమిక్ కాలం 323 నుంచి 30 బీసీ వరకు రామ్సెస్ II ఆలయం గురించి, అక్కడ జరిగిన కార్యకలాపాల గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడతాయని ఈజిప్ట్లోని పురాతన వస్తువుల సుప్రీం కౌన్సిల్ అధిపతి మోస్తఫా వాజిరి చెప్పారు. అలాగే మమ్మీ చేయబడిన జంతువుల అవశేషాలతో పాటు దాదాపు 4,000 సంవత్సరాల క్రితం నాటి ఐదు మీటర్ల మందం (16 అడుగుల) గోడలతో కూడిన ప్యాలెస్ అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు అనేక విగ్రహాలు, పాపిరి, పురాతన చెట్ల అవశేషాలు, తోలు బట్టలు, బూట్లు కూడా కనుగొన్నారు. కైరోకు దక్షిణంగా ఉన్న అబిడోస్ ఆలయాలకు ప్రసిద్ధి చెందింది.
Also Read
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
Read Also: Atiq Ahmed: ప్రయాగ్రాజ్ జైలులోని హైసెక్యూరిటీ బ్యారక్కు అతిక్ అహ్మద్!
ఈజిప్టు క్రమం తప్పకుండా కొత్త పురావస్తు ఆవిష్కరణలను ప్రకటిస్తుంది. ఇది వారి శాస్త్రీయ లేదా చారిత్రాత్మక ప్రాముఖ్యత కంటే రాజకీయ, ఆర్థిక ప్రభావం కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 105 మిలియన్ల మందికి నివాసంగా ఉన్న ఈజిప్ట్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆ దేశం ఎక్కువగా పర్యాటకంపై ఆధారపడింది. పర్యాటకమే రెండు మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారికి ముందు 13 మిలియన్లతో పోలిస్తే, 2028 నాటికి సంవత్సరానికి 30 మిలియన్ల మంది సందర్శకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పర్యాటకాన్ని పునరుద్ధరించాలని కైరో భావిస్తోంది.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!