Home
Earthquake
Earthquake News
-
Earthquake: ఇండోనేషియాలో 6.7 తీవ్రతతో భారీ భూకంపం..
Earthquake: వరసగా భారీ భూకంపాలతో ద్వీపదేశం ఇండోనేషియా వణికిపోతోంది. తాజాగా బుధవారం రాత్రి 8.02 గంటలకు మరోసారి శక్తివంతమైన భూకంపం వచ్చింది. 6.7 తీవ్రతతో బండా సముద్రంలో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టాల గురించిన వివరాలు తెలియలేదు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. -
Earthquake: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.6గా నమోదు
నేపాల్లో 157 మందిని బలిగొన్న భూకంపం.. ఇప్పుడు ఢిల్లీని తాకింది. సాయంత్రం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. -
Manipur Earthquake: మణిపూర్లో భూకంపం.. 3.1 తీవ్రత నమోదు
మణిపూర్లోని చురచంద్పూర్లో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతగా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5:42 గంటలకు భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించండంతో భయంతో జనాలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. -
Nepal Earthquake: నేపాల్లో భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
నేపాల్లో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం దాటికి మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. విపరీతమైన చలిలో వీధుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. -
Earthquake: తైవాన్, నేపాల్లో భూకంపం
తైవాన్ రాజధాని తైపీలో మంగళవారం ఉదయం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. భూకంపం సమయంలో తైపీలోని భవనాలు కంపించాయి. మంగళవారం ఉదయం నేపాల్లో మరోసారి భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 4:17 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. -
Earthquake: జమ్మూ కాశ్మీర్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు..
ఆదివారం ఉదయం నేపాల్లో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. రాజధాని ఖాట్మాండుకు పశ్చిమాన 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్ లో భూకంప కేంద్రం ఉంది. -
Earthquake: నేపాల్లో మళ్లీ భూకంపం.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడి
Earthquake: నేపాల్లో మళ్లీ భూకంపం. ఈరోజు (ఆదివారం) ఉదయం 7.24 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. -
Nepal Earthquake: నేపాల్ రాజధాని ఖాట్మండులో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు
Nepal Earthquake: నేపాల్ రాజధాని ఖాట్మండులో ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 7.39 గంటలకు..బాగ్మతి, గండకి ప్రావిన్స్లలో కూడా భూకంపం సంభవించింది. -
Earthquake: ఉత్తరఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు
Earthquake: ఢిల్లీ-ఎన్సీఆర్ తర్వాత ఉత్తరాఖండ్లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఈ భూకంప ప్రకంపనలు పితోర్ఘర్ జిల్లాకు ఈశాన్యంగా 48 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భావించారు. -
Breaking News: ఢిల్లీలో భూకంపం..3.1 తీవ్రతతో కంపించిన భూమి..
Breaking News: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ రోజు సాయంత్రం 4.08 గంటలకు హర్యానా ఫరీదాబాద్లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) వెల్లడించింది. ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.
తాజావార్తలు
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!