Earthquake: ఢిల్లీలో 2.6 తీవ్రతతో భూకంపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. శనివారం ఢిల్లీలో 2.6 తీవ్రతతో మధ్యామ్నం 3.36 గంటలకు భూకంపం సంభవించింది. నార్త్ డిస్ట్రిక్ట్ లో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదు.
ఇటీవల కాలంలో దేశరాజధాని ఢిల్లీలో పలుమార్లు భూమి కంపించింది. హిమాలయాలు, ముఖ్యంగా నేపాల్ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడల్లా ఢిల్లీలో ప్రకంపనలు ఏర్పడ్డాయి. కొద్ది రోజుల క్రితం నేపాల్ లోని పశ్చిమ ప్రాంతంలో 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ సమయంలో ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు వచ్చాయి.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్ఫేక్ వివాదం.. వివరాలు ఇవ్వాలని మోటాను కోరిన పోలీసులు..
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సీస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం అధిక భూకంప ప్రమాద జోన్గా పరిగణించబడే జోన్ IVలో ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) వస్తాయి. జోన్ IV అనేది మోస్తరు నుండి అధిక స్థాయి తీవ్రతతో భూకంపాలు సంభవించే అధిక సంభావ్యత గల ప్రాంతాన్ని సూచిస్తుంది.
ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ క్రమంగా ఉత్తరంగా కదులుతూ, ఆసియన్ టెక్టానిక్ ప్లేట్ని ముందుకు నెడుతుండటంతో దీని నుంచి విడుదలయ్యే శక్తి భూకంపాలుగా బయటకు వస్తోంది. గతంలో ఈ పరిణామాల వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ కదలికలు ఎప్పుడో రోజు హిమాలయాలు, ఉత్తర భారతదేశం, నేపాల్ ప్రాంతాల్లో భారీ భూకంపాలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!