అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్లో మరో దారుణం వెలుగు చూసింది. ఈ మధ్య వరుస హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా అంబులెన్స్లో ఓ యువతిపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం అమలవుతోంది. ఉచిత ప్రయాణ మనో.. ఇంకెం కారణమో తెలియదు గానీ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ రద్దీగా తిరుగుతున్నాయి.
అతివేగం అమాయకురాలైన ఓ మహిళ ప్రాణం తీసింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. కారు మహిళా పారిశుధ్య కార్మికురాలిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఈరోజు ఉదయం.. గురుగ్రామ్లోని సైక్బర్ సిటీలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్ కారు ఘటనాస్థలిలోనే ఉంచి పారిపోయాడు.
ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వారిపైకి వ్యాన్ మృత్యువులా పైకి వచ్చింది. దీంతో.. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది. ఈ ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాగా.. ప్రమాదానికి పాల్పడిన వ్యాన్ డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
NWKRTC: కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో బస్సు డ్రైవర్ ఒక చేత్తో గొడుగు పట్టుకుని బస్సును నడుపుతున్నాడు.
డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. నిర్లక్ష్యంగా వాహనం నడపటంతో చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి బస్సు కింద పడి మృతి చెందింది. బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో వాడపల్లి శ్రీవల్లి (5) అనే చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారి అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన కాగా.. అత్తిలి జేమ్స్ స్కూల్లో…
కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ ఆదివారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని తన నివాసంలో దారుణంగా కత్తిపోట్లకు గురై, చనిపోయారు. అయితే ఈ హత్య కేసులో పోలీసులు కిరణ్ అనే కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు కొంతకాలంగా.. కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే అతన్ని కొన్ని రోజుల కిందట ప్రతిమ సర్వీసు నుంచి తొలగించింది.