Tragedy: చెట్టు కింద సేద తీరుతున్న వారిపై దూసుకెళ్లిన వాహనం, నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వారిపైకి వ్యాన్ మృత్యువులా పైకి వచ్చింది. దీంతో.. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది. ఈ ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాగా.. ప్రమాదానికి పాల్పడిన వ్యాన్ డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Read Also: Boat Capsized : నది దాటుతుండగా బోటు బోల్తా .. 20 మంది మృతి
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
మృతులు.. బుదౌన్ జిల్లాకు చెందిన ప్రకాష్ (42), బ్రజ్పాల్ (35), ధనపాల్ (55), జ్ఞాన్ సింగ్ (40)గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. “జిల్లాలోని పైగామ్ భికంపూర్ గ్రామంలో ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో ఓ వ్యాన్ అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు.. మరో ఇద్దరు గాయపడ్డారని.. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మేజిస్ట్రేట్ మనోజ్ కుమార్ చెప్పారు.
Read Also: T20 World Cup 2024: రిషబ్ పంత్ ఫిఫ్టీ.. బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం!
ఈ ఘటనపై స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వ్యాన్ డ్రైవర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లకుండా పోలీసులను అడ్డుకున్నారు. “మేము స్థానికులతో టచ్లో ఉన్నాము. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చాము” అని మేజిస్ట్రేట్ తెలిపారు. శనివారం సాయంత్రం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు పోలీసు సూపరింటెండెంట్ అలోక్ ప్రియదర్శి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం గ్రామంలో పోలీసు సిబ్బందిని మోహరించారు.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..