Bihar: బీహార్లో దారుణం.. అంబులెన్స్లో యువతిపై గ్యాంగ్రేప్
- బీహార్లో దారుణం
- అంబులెన్స్లో యువతిపై గ్యాంగ్రేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్లో మరో దారుణం వెలుగు చూసింది. ఈ మధ్య వరుస హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా అంబులెన్స్లో ఓ యువతిపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి: UP: యూపీలో మరో దారుణం.. ప్రియుడి సలహాతో అన్నంలో విషం పెట్టి భర్తను చంపేసిన భార్య
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
బీహార్లోని బోధ్గయ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జూలై 24న బీఎంపీ-3 పరేడ్ గ్రౌండ్లో హోంగార్డు నియామకాలు జరిగాయి.. రేసులో పాల్గొన్న ఒక యువతి స్పృహ కోల్పోయింది. అక్కడే ఉన్న అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అయితే ఇదే అదునుగా భావించిన అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే జరిగిన ఘోరాన్ని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
ఇది కూడా చదవండి: Minister Anitha: ఓ మహిళ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడకూడదు.. రోజాపై హోంమంత్రి ఫైర్
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ఆనంద్ కుమార్ ప్రకారం. మహిళా అభ్యర్థి అత్యాచారం గురించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్లను రెండు గంటల్లోనే అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసును నిర్వహించడానికి బోధ్ గయ SDPO సౌరభ్ జైస్వాల్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే సాక్ష్యాలను సేకరించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని పంపినట్లు చెప్పారు. అలాగే ఆ ప్రాంతంలోని సీసీటివి ఫుటేజ్ నిందితులను గుర్తించడంలో సహాయపడిందని చెప్పారు. బోధ్ గయ పోలీస్ స్టేషన్లో ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) దాఖలు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరగా దర్యాప్తు పూర్తవుతుందని.. చార్జిషీట్ కూడా దాఖలు చేస్తామని, నిందితులపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని ఆనంద్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!