Gaza: ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గాజాపై చేసిన ప్రకటన సంచలనంగా మారింది. గాజాలోని పాలస్తీనియన్లను ఇతర అరబ్ దేశాలు తీసుకోవాలని సూచించారు. పాలస్తీనియన్లకు జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు ఆశ్రయం కల్పించాలని లేదంటే సాయం నిలిపేస్తామని ట్రంప్ హెచ్చరించారు. పాలస్తీనియన్లు ఖాళీ చేసిన తర్వాతే గాజాని స్వాధీనం చేసుకుంటామని, అప్పుడు మాత్రమే గాజా పునర్ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. గాజాపై తన ప్రతిపాదన గురించి జోర్డాన్ రాజుతో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. అయితే, ఈ ప్రతిపాదనని జోర్డాన్ తోసిపుచ్చింది.…
ప్రధాని మోడీ ఫ్రాన్స్లో పర్యటించారు. మంగళవారం ఏఐ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. మంగళవారం సాయంత్రం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్తో సమావేశమయ్యారు.
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల ఫ్రాన్స్ అమెరికా పర్యటనలో ఉన్నారు. దాని మొదటి దశలో ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో కలిసి 'AI యాక్షన్ సమ్మిట్'కు అధ్యక్షత వహిస్తారు.
Donald Trump: అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలనంగా మారారు. అనేక నిర్ణయాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన ఉక్రెయిన్పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యాలో భాగం కావచ్చు’’ అని అన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీని కలవడానికి కొన్ని రోజులు ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని హమాస్కు గట్టి హెచ్చరిక చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు గాజాలో ఉన్న బందీలను విడుదల చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రపంచమంతా ఆ దృశ్యాలను చూసే అవకాశం ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా, యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. “అక్కడ మిగిలి…
Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ వ్యతిరేక వ్యక్తిగా పేరున్న అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భారతదేశాన్ని అస్థిరపరిచేసందుకు సోరోస్ కుట్ర పన్నినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన అమెరికా పర్యటనకు ముందు కీలక సందేశం ఇచ్చారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోడీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ..‘‘ నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఎక్స్లో ట్వీట్ చేశారు. ట్రంప్ మొదటి పదవీకాలంలో నిర్మించబడిన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడాని పర్యటన సహకరిస్తుందని మోడీ అన్నారు. ప్రధాని మోడీ ముందుగా మూడు రోజుల పర్యటన…
Rupee All time Low : డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను, వాటి కరెన్సీలను ప్రభావితం చేస్తోంది. సోమవారం డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 44 పైసలు తగ్గి చారిత్రాత్మక కనిష్ట స్థాయి 87.9400కి చేరుకుంది.
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే, ఈ విషయాన్ని రష్యా ధృవీకరించలేదు, అలాగని ఖండించలేదు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడం గురించి పుతిన్తో ఫోన్లో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఉక్రెయిన్లో సంఘర్షణను ముగించడం గురించి తాను పుతిన్తో మాట్లాడినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని , “ప్రజలు చనిపోవడం ఆపాలనే” కోరికను పుతిన్ వ్యక్తి చేసినట్లు నివేదించింది. Read Also: Biren Singh:…
IMEC: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఇరు దేశాల సంబంధాలు, రక్షణ, ఇతర అంశాలు చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా ‘‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)’’ ప్రాజెక్టు ఇరువురి మధ్య కీలకంగా మారబోతోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI) కు ప్రత్యామ్నాయంగా IMEC ఉండబోతోంది. ఈ ప్రాజెక్టులో బిలియనీర్ అదానీ కీలకంగా ఉన్నారు.