Trump’s Tariff: ట్రంప్ సుంకాలపై ఉత్కంఠ.. భారత్పై ప్రభావం..
- ట్రంప్ టారిఫ్లపై ప్రపంచదేశాల్లో ఉత్కంఠ..
- పలు దేశాలపై ఈ రోజు ‘‘పరస్పర సుంకాలు’’ విధింపు..
- భారత్పై ప్రభావం పడే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump’s Tariff: డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించబోతున్నాడు. ఏప్రిల్ 2 ‘‘విముక్తి దినోత్సం’’ సందర్భంగా ఇండియాతో పాటు ఇతర దేశాలపై సుంకాలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అంతా ఉత్కంఠత నెలకొంది. పరస్పర సుంకాలు ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌజ్ మంగళవారం తెలిపింది. ట్రంప్ కొన్నాళ్ల నుంచి చాలా గొప్పగా చెప్పుకుంటున్న ‘‘పరస్పర సుంకాల’’ను ప్రకటించనున్నారు. అయితే, ఒక రోజు ముందు ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ తమ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తుందని తాను విన్నానని ఆయన అన్నారు.
భారత్తో పాటు చాలా దేశాలు కూడా సుంకాలు గణనీయంగా తగ్గిస్తాయని అనుకుంటున్నానని, ఎందుకంటే గత కొన్నేళ్లుగా అమెరికాపై అన్యాయంగా సుంకాలు విధిస్తున్నారని ట్రంప్ విలేకరుల సమావేశంలో అన్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే యూరోపియన్ యూనియన్ కార్లపై తమ సుంకాలను 2.5 శాతానికి తగ్గించింది. ట్రంప్ ప్రకటనకు కొన్ని గంటల ముందు భారత్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధిస్తుందని వైట్ హౌజ్ తెలిపింది.
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
Read Also: LSG vs PBKS: దంచికొట్టిన ప్రభ్ సిమ్రాన్.. లక్నోపై పంజాబ్ విజయం
అమెరికన్ పాల ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ 50 శాతం, అమెరికన్ బియ్యంపై జపాన్ 700 శాతం సుంకాన్ని విధిస్తుంది, అమెరికన్ బటర్, అమెరికన్ చీజ్పై కెనడా దాదాపు 300 శాతం సుంకాన్ని విధిస్తుందని వైట్ హైజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 2021-22 నుంచి 2023-24 వరకు అమెరికా భారత్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారతదేశం యొక్క మొత్తం వస్తువుల ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతం కలిగి ఉంది. ఇరు దేశాల మధ్య 2023-24లో $22.73 బిలియన్ల వాణిజ్యం జరిగింది.
అయితే, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు చేయడానికా రాబోయే రోజుల్లో ఇరు దేశాల అధికారు చర్చలు జరపాలని నిర్ణయించారు. చర్చలు బాగా జరుగుతున్నాయని, భారత్ ప్రయోజనాలను కాపాడుకుంటూనే రెండు దేశాల మంచికి ఉపయోగపడుతాయని ఇటీవల వాణిజ్య మంత్రి పియూష్ గోయాల్ అన్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ట్రంప్ కెనడా, చైనా, మెక్సికోలపై సుంకాలు విధించాడు. ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై ముఖ్యంగా 10 నుంచి 15 దేశాలు పరస్పర సుంకాల ప్రభావాన్ని ఎదుర్కోబోతున్నాయి.
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
-
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
-
Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!