Trump’s Tariff: ట్రంప్ సుంకాలపై ఉత్కంఠ.. భారత్పై ప్రభావం..
- ట్రంప్ టారిఫ్లపై ప్రపంచదేశాల్లో ఉత్కంఠ..
- పలు దేశాలపై ఈ రోజు ‘‘పరస్పర సుంకాలు’’ విధింపు..
- భారత్పై ప్రభావం పడే ఛాన్స్..
Trump’s Tariff: డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించబోతున్నాడు. ఏప్రిల్ 2 ‘‘విముక్తి దినోత్సం’’ సందర్భంగా ఇండియాతో పాటు ఇతర దేశాలపై సుంకాలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అంతా ఉత్కంఠత నెలకొంది. పరస్పర సుంకాలు ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌజ్ మంగళవారం తెలిపింది. ట్రంప్ కొన్నాళ్ల నుంచి చాలా గొప్పగా చెప్పుకుంటున్న ‘‘పరస్పర సుంకాల’’ను ప్రకటించనున్నారు. అయితే, ఒక రోజు ముందు ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ తమ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తుందని తాను విన్నానని ఆయన అన్నారు.
భారత్తో పాటు చాలా దేశాలు కూడా సుంకాలు గణనీయంగా తగ్గిస్తాయని అనుకుంటున్నానని, ఎందుకంటే గత కొన్నేళ్లుగా అమెరికాపై అన్యాయంగా సుంకాలు విధిస్తున్నారని ట్రంప్ విలేకరుల సమావేశంలో అన్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే యూరోపియన్ యూనియన్ కార్లపై తమ సుంకాలను 2.5 శాతానికి తగ్గించింది. ట్రంప్ ప్రకటనకు కొన్ని గంటల ముందు భారత్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధిస్తుందని వైట్ హౌజ్ తెలిపింది.
Also Read
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
Read Also: LSG vs PBKS: దంచికొట్టిన ప్రభ్ సిమ్రాన్.. లక్నోపై పంజాబ్ విజయం
అమెరికన్ పాల ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ 50 శాతం, అమెరికన్ బియ్యంపై జపాన్ 700 శాతం సుంకాన్ని విధిస్తుంది, అమెరికన్ బటర్, అమెరికన్ చీజ్పై కెనడా దాదాపు 300 శాతం సుంకాన్ని విధిస్తుందని వైట్ హైజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 2021-22 నుంచి 2023-24 వరకు అమెరికా భారత్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారతదేశం యొక్క మొత్తం వస్తువుల ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతం కలిగి ఉంది. ఇరు దేశాల మధ్య 2023-24లో $22.73 బిలియన్ల వాణిజ్యం జరిగింది.
అయితే, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు చేయడానికా రాబోయే రోజుల్లో ఇరు దేశాల అధికారు చర్చలు జరపాలని నిర్ణయించారు. చర్చలు బాగా జరుగుతున్నాయని, భారత్ ప్రయోజనాలను కాపాడుకుంటూనే రెండు దేశాల మంచికి ఉపయోగపడుతాయని ఇటీవల వాణిజ్య మంత్రి పియూష్ గోయాల్ అన్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ట్రంప్ కెనడా, చైనా, మెక్సికోలపై సుంకాలు విధించాడు. ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై ముఖ్యంగా 10 నుంచి 15 దేశాలు పరస్పర సుంకాల ప్రభావాన్ని ఎదుర్కోబోతున్నాయి.
తాజావార్తలు
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!